Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AP CM Chandrababu: ఆంధ్రుల ఆశయాలకు అనుగుణంగా..!

–దక్షిణ మధ్య రైల్వే జోన్‌తో ఏపీ ప్రగతికి ఊతం
— రూ.2.08లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
–ప్రధాని మోదీ మద్దతుతో అమ రావతి పూర్తి చేస్తాం
–ఒకే రోజు రూ. 2లక్షల కోట్లకు ప్రా జెక్టులు చారిత్ర అన్న చంద్రబాబు

AP CM Chandrababu: ప్రజా దీవెన, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ఆశయాల సాధనకు కేంద్రంలోని తమ ప్రభుత్వం అండ గా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. చంద్రబాబు ‘విజన్‌–2047’కు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వరుస గా మూడోసారి ప్రధాన మంత్రి అయ్యాక తొలిసారి విశాఖపట్నo కు వచ్చిన మోదీ రూ.2.08లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విభజన హామీ ల్లో కీలకమైన విశాఖపట్నం రైల్వే జోన్‌తోపాటు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లకు శంకుస్థాపన చేశారు. పలు రైల్వే, రోడ్డు ప్రాజె క్టులను విశాఖపట్నం వేదికగా జా తికి అంకితం చేశారు. ఈ సందర్భం గా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీ రింగ్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించా రు. ‘ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమా నానికి నా కృతజ్ఞతలు. మీపట్ల నాకున్న అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు లభించింది. ముందుగా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామికి నమ స్కారమoటూ తెలుగులో ప్రసం గాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హిందీలో మాట్లాడారు.

‘ఆంధ్రప్రదే శ్‌ అభివృద్ధి మా విజన్‌. ఆంధ్రుల సేవ మా సంకల్పం. 2047నాటికి రాష్ట్రం 2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న విజన్‌తో చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి భుజం కలిపి తోడుగా నిలుస్తుంది’’ అని మోదీ ప్రకటించారు. విశాఖపట్నంలో సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేశామని… ప్రత్యేక జోన్‌ కావాలన్న ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవే రుతోం దని ప్రధాని పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి రైల్వేజోన్‌ ఎంతో కీలకం. వ్యవసాయ, వ్యాపార, పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏపీలో వందశాతం రైల్వే లైన్ల విద్యుదీక రణ జరిగింది. వందే భారత్‌ రైళ్ల తోపాటు అమృత్‌ భారత్‌ సర్వీ సులు రాష్ట్ర ప్రజలకు అందుబా టులోకి వచ్చాయి. మౌలిక సదు పాయాల విప్లవంతోపాటు మెరుగై న కనెక్టివిటీతో ఏపీ ముఖచిత్రం మారబోతోంది. ఇప్పుడు ప్రారం భించిన పనులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయి’’ అని ప్రధాని పేర్కొ న్నారు. కాగా మహబూబ్‌నగర్‌ టు డోన్‌ డబ్లింగ్‌ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.

పోలవరం ద్వారా నదుల అను సంధానం …* పోలవరం ద్వారా నదులను అనుసంధానం చేస్తా మని, మోదీ అండతో అమరావతి పూర్తిచేస్తామని చంద్రబాబు పేర్కొ న్నారు. ‘‘మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. ప్రజలు అండగా ఉండాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలను చేరుకోలేం. ప్రజల నిరంతర మద్దతుతో ఎలాం టి సుపరిపాలన ఇవ్వగలమో మో దీ నిరూపించారు. ఎన్డీయే బలంగా ఉంటే భారత్‌ బలంగా ఉంటుంది. కూటమి బలం గా ఉంటే ఏపీ బలం గా ఉంటుందన్నారు. బుధవారం విశాఖపట్నం వేదికగా ప్రధాని మో దీ చేతుల మీదుగా జరిగిన అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకు స్థాపనలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ, టీడీపీ, జనసేన మైత్రి కొనసాగుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘‘గత ఎన్నికల్లో మోదీ, పవన్‌, నేనూ కలిశాం. నేను 45 ఏళ్లుగా రాజ కీయాల్లో ఉన్నాను. ఎప్పుడూ లేనట్లుగా 93 శాతం స్ట్రైక్‌ రేట్‌తో ఘన విజయం సాధించాం. ఈ కాంబినేషన్‌ ఎప్పటికీ కొనసా గుతుంది. మోదీ దేశ ప్రధానిగా కొనసాగుతారు. దేశం, ప్రపంచం మెచ్చే నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.

వైసీపీ చీకటిపాలన నుంచి వెలుగులోకి… ఐదేళ్ల అరాచక, చీకటి పాలనను తొలగించుకుని, వెలుగు రేఖల వైపు ఇప్పుడిప్పుడే ఏపీ అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నా రు. వైసీపీ పాలనా కాలంలో అభివృద్ధికి ఏపీలో ఆస్కా రం లేదనే వాతావరణం ఉండే దన్నారు. అలాంటిది అభివృద్ధి అంటేనే ఆంధ్రా అనేలా ఈనాడు ముందుకు వెళుతున్నామని అన్నారు. ‘కూటమిపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తున్నాం. అందులో భాగంగానే రాష్ట్రానికి రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడులు వ చ్చాయి. వీటి ద్వారా సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.