Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ap Deputy CM Pawan Kalyan: అఖండగోదావరి ప్రాజెక్ట్‌తో రాజమ హేంద్రవరంకు పర్యాటక శోభ

–టూరిజం స్పాట్‌గా రాజమండ్రి పా త రైల్వే వంతెన అభివృద్ధి
— ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Ap Deputy CM Pawan Kalyan : ప్రజా దీవెన, రాజమండ్రి: ఏపీ లోని రాజమహేం ద్రవరంలో ‘అఖండ గో దావరి’ టూ రిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలి సి గురువారం శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్‌ వద్ద రూ.94.44 కో ట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రా జెక్ట్‌ను చేపట్టారు.శంకుస్థాపన కార్య క్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గే శ్‌, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందే శ్వరి పాల్గొన్నా రు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌తో రాజ మహేంద్రవరం ఇక పై పర్యాటక శో భను సంతరించుకోనుంది. సుమా రు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ శ్రీకారం చుట్టారు. రా జమండ్రి వద్ద గోదావరిపై 127 సం వత్సరాల పాత రైల్వే వంతెనను టూరిజం స్పాట్‌గా ప్రభుత్వం అభి వృద్ధి చేయనుంది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం డొక్కా సీతమ్మ అని, ఆదికవి నన్నయలకు జన్మనిచ్చిన నేల గోదావరి తీరమని పేర్కొన్నారు. రూ. 430 కోట్లతో ఏపీ లో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతు న్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆలోచనతో పర్యాటక రంగం లో యువతకు ఉద్యోగ, ఉపాధి అ వకాశాలు లభిస్తాయని, డబుల్ ఇం జన్ సర్కార్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నా యని డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రై వేటీకరణ కాకుండా కేంద్ర మంత్రి షెకావత్ సహకారం అందించార న్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం షెకావత్ సహకారం అందిం చారని కొనియాడారు.

ఏపీలో 974 కిలోమీటర్ల నదీ తీరం ఉందని, విదే శాల్లో నదీ తీరాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసిన విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టు ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామ న్నారు. 20 35 నాటికి రాష్ట్ర వ్యా ప్తంగా ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తా మని పవన్ కల్యా ణ్ స్పష్టం చేశారు. దేశ, విదేశీ పర్యా టకులను ఆకర్షించేలా రాజమండ్రి నగరం, చుట్టు పక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందు కు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్ర భుత్వం శ్రీకారం చుట్టి న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభు త్వ భాగస్వా మ్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు ప్రారంభించింది. డి ప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప ర్య టన నేపద్యంలో రాజమండ్రి పుష్క ర ఘాట్ వద్ద పోలీసులు ప్రటిష్టమై న భద్రతను ఏర్పాటు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి ని మ్మల రామానాయుడు, రాజ మం డ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎ మ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌద రి, బత్తుల బలరామకృష్ణ సహా కూ టమి నాయకులు పాల్గొన్నారు.