–ఆ డైలాగులకనుగుణంగా ప్రవర్తి స్తామoటే ప్రజాస్వామ్యంలో సా ధ్యం కాదు
— జగన్ వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్
AP Deputy CM Pawan Kalyan: ప్రజా దీవెన, అమరావతి: సినిమా లో చెప్పే డైలాగులు సినిమాహాలు వరకే బాగుంటాయని డిప్యూటీ సీ ఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వా టిని ఆచరణలో పెడతామని, ఆ డై లాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తా మని అంటే ప్రజాస్వామ్యంలో సా ధ్యం కాదని తేల్చి చెప్పారు. అలా చేస్తే అన్న వారిని, చేసిన వారిని కూడా లోపలేస్తామని తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్ పల్నాడు ప ర్యటనలో ‘‘గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా’’ అంటూ వైసీపీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎ స్ జగన్ అది సినిమా డైలాగ్ అని సమర్ధించారు. పుష్ప సినిమాలోని అనే డైలాగ్ అని మీడియాతో వెల్ల డించారు. అలా ప్లకార్డ్ ప్రదర్శిం చడం తప్పుకాదంటూ ఆ కార్యక ర్తను వెనకేసుకొచ్చారు.
దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధన లు పాటించాల్సిందే. ప్రజల్లో భ యాందోళనలు రేకెత్తించే అసాంఘి క శక్తుల పై కఠినంగా వ్యవహరించా లని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటి కే దిశానిర్దేశం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితు ల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చి తంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని పేర్కొన్నారు.అశాంతిని, అభద్రతను కలిగించే వారికి మద్ద తుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కో రారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామ ని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమ య ఆలోచనలను ప్రజలంతా గమ నించాలని పవన్ కల్యాణ్ సూచిం చారు. అసాంఘిక శక్తులకు మద్దతు గా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దని డిప్యూటీ సీఎం ప వన్ కల్యాణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గుర్తు చేశారు.