–పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు
–వైసీపీ పార్టీ పట్టించకోవడం లేదు –నామాట పార్టీ లో వినే వారు లేరు
— వైసిపి సీనియర్ నేత బాలినేని సంచలన కామెంట్స్
Balineni Srinivasa Reddy: ప్రజా దీవెన, ఒంగోలు: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి పో తున్నారు. తాజాగా పార్టీపై మా జీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీ ఎం ల విషయంలో తాను చేస్తున్న పోరా టన్ని పార్టీ పట్టించుకోవడం లేద న్నారు. ఎవరు పట్టించుకున్నా ప ట్టించుకోకపోయినా ప్రజల కోసం తాను పని చేస్తూనే ఉంటానని చె ప్పుకొచ్చారు. ఎన్నికలు అయి పో యినప్పటి నుంచి పార్టీ(PARTY) నుంచి తన కు ఎలాంటి సమాచారం రాలేదన్నా రు. పార్టీ కార్యక్రమాలకూ పిలువ డం లేదని అసంతృప్తి వ్యక్తం చే శారు.
వైసీపీ పట్టించుకోవడం లేదన్న బాలినేని
పార్టీలో (PARTY)తన మాట కూడా వినేవా రులేరని ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ బాలినేని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు అయి నప్పటి నుంచి తాును పార్టీకి దూ రంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మాట్లాడితే జనసేనలోకి వెళ్తానని ప్రాచరం చేస్తున్నారని ఆ పార్టీలో కి వెళ్లకుండా కొంత మంది కుట్ర చేసి ఈ ప్రచారం చేస్తున్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తనపై రాజకీయంగా దాడి చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇటీవల ఆయనపై భూకబ్జా ఆరోపమలు ఎక్కవగా వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆయన తనపై రాజకీయంగా దాడి జరుగుతోందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం తనపై సీఐడీతో (CID) అయినా విచారణ చేయించుకోవచ్చని సవాల్ విసిరారు.
గతంలోనే జనసేనతో చర్చలు..?
బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) జగన్ కుటుం బానికి దగ్గర బంధువు. అయినప్ప టికీ ఆయనకు ఇటీవలి కాలంలో ప్రాధాన్యత దక్కడం లేదు. ఎన్ని కలు ముందు్ కూడా తాను పోటీ చేయబోనని ప్రకటించారు . కానీ ఎన్నికల సమయంలో జగన్ టిక్కెట్ ప్రకటించడంతో మళ్లీ పోటీ చేశారు. కానీ అత్యంత ఘోరమైన పరా జ యం చూశారు. ఈవీఎంలపై అను మానంతో వాటి పరిశీలనకు ఫీజు కట్టి వాటి పనితీరును పరిశీలించేం దుకు సిద్ధమయ్యారు. అయితే మా క్ పోలింగ్ (MACK POLINING) వద్దని పోలైన ఓట్లను పరిశీలిస్తానని ఆయన మళ్లీ ఉన్న త న్యాయస్థానానికి వెళ్లారు.
మరోసారి అలాంటి చర్చలు జరుగుతున్నాయా ?
తాజాగా బాలినేని చేసిన ప్రకటనను చూస్తే ఆయన వైసీపీకి షాకవ్వడం కాయంగా కనిపిస్తోంది. గతంలో కూడా చాలా సార్లు ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ జనసేన లోకి వెళ్లకుండానే ఇలాంటి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తంగా వైసీపీకి (YCP)మరో బడా లీగర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యా రని అనుకోవచ్చు.