Bandi Sanjay Garangaram : ప్రజా దీవెన, కరీంనగర్: లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడు తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాం గ్రెస్, బీఆ ర్ఎస్, డీఎంకే, ఆప్, సీపీఎం పార్టీ లపై తీవ్రస్థాయిలో విరుచుకుప డ్డారు. కరీంనగర్ లోని శుభం గార్డె న్ లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొ మరయ్య, అంజిరెడ్డి లను ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా బండి సంజ య్ హాజరై ప్రసంగించారు. స్టాలిన్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసింది. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడింది. ఆప్, బీఆర్ ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కాం చే సి జైలుకు పోయింది. వీళ్లంతా కలి సి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలా డుతూ మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వాళ్లంతా దేశ జీడీపీకి, పార్లమెంట్ లో ప్రాతిని ధ్యానికి లింకు పెట్టడంపై మం డిపడ్డారు. ‘‘నిన్న చెన్నైయ్ లో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావే శంలో లిక్కర్ దొంగల ముఠా ఒకే చోట సమావేశమై విచిత్రమైన తీ ర్మానం చేశారు. దేశ జీడీపీలో దక్షి ణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్ లో కూడా దక్షిణాదికి 36 శాతందాకా వాటా ఇవ్వాలని అడుగుతున్నరు. ఇదేం విచిత్రం దేశ జీడీపీకి పార్లమెంట్ లో ప్రాతి నిధ్యానికి సంబంధమేంది అట్లను కుంటే తెలంగాణ జీడీపీ లో వెనుక బడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతిని ధ్యం చాలా తక్కువ. అంత మా త్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతిని ధ్యం ఉండకూడదా ఇదెక్కడికి దిక్కుమాలిన ప్రతిపాదన దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలి మిటేషన్ ను అడ్డుకునే కుట్రలు చే యడమేందని ఫైర్ అయ్యారు.
తపస్ ఉపాధ్యాయ సంఘం గురించి బండి మాట్లాడుతూ టీచర్ల దమ్మేందో, తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుం టే ఏమైతదో మొన్నటి ఎమ్మెల్సీ ఎ న్నికల్లో చూపించారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులారా మీరంతా ఏ సంఘంవైపు చూడకండి. జాతీయ వాద భావజాలం, టీచర్ల కోసం కొ ట్లాడే ఏకైక సంఘం తపస్. ఆ సం ఘంలోనే చేరాలని కోరుతున్నా. మీకోసం కొట్లాడేది, దెబ్బలు తినే ది, జైలుకు కూడా పోయేందుకు వెనుకాడని నాయకులు తపస్ మాత్రమే. అందుకే తపస్ బలపర్చి న అభ్యర్ధి మల్క కొమరయ్యకు టి క్కెట్ ఇప్పించి సునాయాసంగా గెలి పించింది. తపస్ ను రాష్ట్రంలో నెం బర్ వన్ సంఘంగా మార్చి తీరు తాం. తెలంగాణ సాధనలో టీచర్ల, ఉద్యోగుల పాత్ర మరువలేం. 42 రోజుల సకల జనుల సమ్మె చేసి తెగించి కొట్లాడి రాష్ట్రం సాధించు కున్నరు. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ అప్పుల పా లైంది. కేసీఆర్ కుటుంబ పాలన తో సర్వ నాశనమైంది. గతంలో కేసీఆ ర్ మనుషులు బీదర్ లో ఒక ప్రిం టింగ్ ప్రెస్ లో దొంగ నోట్లు ముద్రిం చారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ ను మూ సివేసేందుకు మన రాష్ట్ర పోలీసు లు వెళితే ఒత్తిడి తెచ్చి అక్కడికి వెళ్లకుండా చేశారు.
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పంచిన నోట్లన్నీ దొంగ నోట్లే బీఆర్ఎస్ పాలన పీడ విరగడ కావాలని ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే ఏం ఒరిగింది కేసీఆర్ పాలనలో తెలం గాణ అప్పుల్లో మునిగిపోయిందని చెప్పిన రేవంత్ రెడ్డి అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉ ద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల ను తీర్చడంతోపాటు 6 గ్యారంటీ లను కూడా అమలు చేసి తీరుతా మని ప్రకటించారు. కానీ ఏమైంది? 15 నెలలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాం గ్రెస్ పార్టీ దారుణంగా వంచిస్తూనే ఉన్నడు. విద్యాశాఖకు అసలు మంత్రి కూడా లేదు. ఆయనే ఆ శాఖ మంత్రిగా ఉన్నా టీచర్లకు ఒరిగిందేమీ లేదు.
కేంద్రం ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ ఇస్తోంది… నిత్యం మోదీపై విషం కక్కే కాంగ్రెస్ ప్రభుత్వం 5 డీఏలు ఎందుకు పెండింగ్ లో పెట్టారు? మరో 3 నెలలైతే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. టీచర్ల, ఉద్యోగుల పెండింగ్ బిల్స్ మొత్తం రూ.8వేల కోట్లు. అట్లాగే రిటైర్డ్ మెంట్ బెన్ పిట్స్ బకాయిలు రూ.11 వేల కోట్లు. వీళ్లకు పైసలు ఇవ్వమంటే డబ్బుల్లేవని చెబు తున్న ప్రభుత్వం 18 శాతం కమీ షన్ ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు బి ల్స్ క్లియర్ చేస్తోంది. ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వడం లేదు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలివ్వ డం లేదు. కేజీబీవీ టీచర్ల బాధలు వర్ణణాతీం. ఈ సమస్యను పరిష్క రించాలని విద్యాశాఖ అధికారి యోగితారాణాకు నేనే ఫోన్ చేసిన. ఆ సమస్య పరిష్కారం కోసం క్రుషి చేస్తా.టీచర్లను, తపస్ నాయకుల ను నేను కోరేదొక్కటె సమస్యలపై పోరాడండి. తపస్ తల్చుకుంటే విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళ న కావాలి. టీచర్ల సమస్యలు పరి ష్కారం కావాలే. ప్రభుత్వం ఉద్యో గం నుండి తీసేస్తదనే భయం మీకు వద్దు. మిమ్ముల్ని కాపాడుకునే బా ధ్యత మాది. ఎందుకంటే విద్యా శా ఖను అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టి తుపాకీ రాజ్యం తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మోదీ ప్రభుత్వం విద్యార్థులకు క లం అందించి మహానుభావులుగా తీర్చిదిద్దాలని చూస్తుంటే… కాంగ్రెస్ అందుకు భిన్నంగా పాఠ్యపుస్తకాల్లో అర్బన్ నక్సల్స్ భావజాలాన్ని జొ ప్పించి తుపాకీ రాజ్యం కోసం కుట్ర లు చేస్తుంటే సమాజానికి ఏ సందే శం పంపినట్లు అసలు ఏ ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అర్బన్ నక్సల్స్ ను విద్యా కమిషన్ లో నియమిం చారో సమాధానం చెప్పాలి. ఈ వి ధానాన్ని తపస్ కచ్చితంగా వ్యతిరే కించి ఉద్యమం ప్రారంభించాలి. ఎంతకాలం బతికామన్నది కాదు.. బతికి ఉన్నంత కాలం జీవితమం తా స్పూర్తిదాయకంగా ఉండేలా పోరాడాలి. హీరోలెక్క బతకాలే తప్ప జీరో కావొద్దు.
317 జీవోసహా టీచర్ల సమస్యలపై నిరంతరం పోరాడి జైలుకు పోయిం ది బీజేపీయే. ప్రజల కోసం కొట్లాడి తే నాపై 109 కేసులు పెట్టారు. తప స్ నాయకులు కూడా టీచర్ల సమ స్యలపై, ప్రజల కోసం పోరాడండి. ఉద్యోగం కోల్పోతే వాళ్లకే భవిష్య త్తులో జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం. ఎందుకం టే ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీ జేపీ అధికారంలోకి రావడం తథ్య మనే తేలిపోయింది.
ఎందుకంటే కాంగ్రెస్ చేసిన మో సాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నా రు. నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ తెలం గాణలో రుణమాఫీని పూర్తిగా అ మలు చేసినట్లు ప్రకటించారు. ఇది చూసి ఇంత మోసమా? అంటూ రైతులంతా కాంగ్రెస్ ను బండబూ తులు తిడుతున్నరు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2 లక్షల రుణ మాఫీ అర్హుల జాబితా 42 లక్షలు. వీరందరికీ రుణమాఫీ కావాలంటే 31 వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇప్పటి వరకు 25 లక్షల 35 వేల మందికి 20 వేల కోట్లు మా త్రమే రుణమాఫీ చేశారు. మరి మిగిలిన 16 లక్షల 65 వేల మంది పరిస్థితి ఏంది? వీళ్లకు రుణమాఫీ కావాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. కానీ వీళ్లకు నయాపైసా చెల్లించకుండా రుణమాఫీ పూర్త యిందని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించడం సిగ్గు చేటు. లక్షల మంది రైతులను నిలువునా మో సం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర్లో పడ్డాయని కేంద్ర మంత్రి సంజయ్ అన్నారు.