Bandi Sanjay : ప్రజా దీవెన,కరీంనగర్: ఉభయ తె లుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ తో మాజీ ముఖ్యమంత్రి కే సీఆర్ అనేక మంది జీవితాలను సర్వనాశనం చేశారని కేంద్ర హోంశా ఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా రు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రం నేరుగా సీబీఐ విచారణ జరి పే అవకాశం లేదని, లేకుంటే ఎ ప్పు డో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరి నీ గుంజుకుపోయి చట్ట ప్రకారం బొ క్కలో వేసే వాళ్లమని, ప్రభాకర్ రా వుతో పాటు కేసీఆర్ కుటుంబాన్ని గల్లా పట్టి ఈడ్చుకు వెళ్లి బొక్కలో పె ట్టేవాళ్ళమని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీం నగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి పక్ష నాయకులతో పాటు సొంత పా ర్టీ నాయకుల ఫోన్ నెంబర్లు సైతం ట్యాపింగ్ చేయించిన చేసిన దుర్మా ర్గుడన్నారు. దీని వెనుక ఎవరున్నా రో ప్రజలందరికీ తెలుసముని, అనే క మంది ఉసురుపోసుకున్న దుర్మా ర్గుడు ప్రభాకర్ రావు అన్నారు. నా తో సహా బీజేపీ నేతలందరి ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ తోపాటు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, అనుమానం పుట్టి నంకే కేసీఆర్ పుట్టారన్నారు. అందు కే సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు.జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, గతంలో కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ పై సీ బీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారని అధికారంలోకి వచ్చిన త ర్వాత మాత్రం సిబిఐ విచారణ కోర డం లేదన్నారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏసీబీ రా ధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చి నా కేసీఆర్ కు ఎందుకు నోటీసులివ్వ లేదన్నారు.
కేసీఆర్ కు, కేటీఆర్ కు నోటీసులి వ్వడానికి ఎందుకు వెనుకాడుతు న్నారని, మీ ఇద్దరి మధ్యనున్న ర హస్య ఒప్పందమేంటని ప్రశ్నించా రు. నాపై కేసీఆర్ ప్రభుత్వం 10 9 కేసులు పెట్టిందని, సీఎం ఆఫీస్ ను అడ్డాగా చేసుకుని మేం ఫోన్ లో మాట్లాడుకునే విషయాలన్నీ విన్న నీచుడు ప్రభాకర్ రావు అన్నారు. ప్ర భాకర్ రావుకు రాచమర్యాదలు ఇ వ్వడం ప్రభుత్వం మానుకోవాలన్నా రు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని నేను 100 సార్లు చె ప్పానన్నారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చిన పోలీసులు నేను నైట్ డ్రస్ తో ఉ న్నానని తెలిసినా ప్రభాకర్ రావు ఆ దేశాలతోనే నన్ను అరెస్ట్ చేశారన్నా రు.
ప్రభాకర్ రావుతో పోలీసులు ఇ దే విషయంపై ఫోన్ లో మాట్లాడు తుం టే స్వయంగా నేనే విన్నానన్నారు. కేసీఆర్ పాలనలో మీడియా సహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు, జ ర్నలిస్టులు సైతం వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ ద్వారా మాట్లాడుకునే దుస్థితి తీసుకొచ్చారన్నారు. వా ట్సాప్ కాల్ ను కూడా ట్యాప్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావు అన్నా రు. కాంగ్రెస్, బిజెపి ప్రజా ప్రతిని ధు లు నాయకులతో పాటు అధికా రు ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు.
*కేసీఆర్, కేటీఆర్ లకు కాంగ్రెస్ అండదండ…* కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పం దం కుదిరింది, అందుకే కేసీఆర్, కే టీఆర్ లకు నోటీసులివ్వడం లేదు. ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇం డియాకు వచ్చే ముందే కేటీఆర్ యూఎస్ వెళ్లింది నిజం కాదా, కేటీ ఆర్ అమెరికా వెళ్లిన తరువాతే ప్ర భాకర్ రావు ఇండియాకు వచ్చి స రెండర్ అయ్యారు.కేసీఆర్ మెడలు వంచేలా పోరాటాలు చేసిందే బీజేపీ అని, బీఆర్ఎస్ తో అండర్ స్టాండిం గ్ ఉంటే ఎందుకు పోరాటాలు చేస్తా మని, కాంగ్రెస్ గులాబీ పార్టీ మాదే ఒప్పందం కోరడం వల్లే కేసీఆర్ కేటీ ఆర్ లకు నోటీసులు ఇవ్వడం లేద న్నారు.