Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్

–బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వక పోవడం దుర్మార్గం
–కేంద్రం మీలాగే ప్రవర్తిస్తే ఏమవు తుందో అలోచించండి
–మా మంచితనాన్ని చేతగాని తనంగా భావించొద్దు
–పార్టీ ఫిరాయింపుల్లో బిఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు భావసారూప్యత
–జనసేనతో పొత్తుపై పార్టీ అధినా యకత్వందే తుది నిర్ణయం
–సింగరేణిపై రెండు పార్టీల తప్పు లు కప్పిపుచ్చుకునేoదుకే దుష్ప్ర చారం
–కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Bandi Sanjay: ప్రజా దీవెన, కరీంనగర్: తెలంగాణ (telangana)లో పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపులు, సింగరే ణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ (congress) పార్టీ బీ ఆర్ఎస్ (brs)బాటలోనే నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)ద్వజమె త్తారు. నిధులు కేటాయింపు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ది విష యంలో బీజేపీ ఎమ్మెల్యేలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లు సైతం ప్రజలు ఓట్లేస్తేనే గెలిచార నే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించించుకోవా లని సూచించారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తాము ముం దుకు సాగుతున్నామని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఆదివారం కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ తనను కలిసిన మీడియాతో చిట్ చాట్ (Chit chat) నిర్వహించారు.

బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా లేదని, రెండు పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతున్న యని దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ (brs) చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ చేయడం సిగ్గు చేటని వ్యాఖ్యానిం చారు. కాంగ్రెస్ పార్టీ (congress party) ఎమ్మెల్యేలకు నిధులకు కేటాయింపులో తీవ్ర వివ క్ష చూపుతూ దుర్మార్గంగా వ్యవహరి స్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్ర మే అభివృద్ధి నిధులిస్తోందని, బీజేపీ ఎమ్మెల్యేలకు (BJP MLAs) నిధులివ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ గెలిచి న చోట్ల ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు నియోజకవర్గ ఇంఛార్జీలుగా పెట్టి నిధులిస్తోందని, ఇది ఎంత మాత్రం సరికాదని అన్నారు.ప్రజలిచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని, నిధు లివ్వకుంటే ఇతర పార్టీల ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరతారనే భావన తో వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం లో బీజేపీ (BJP) ఉందని, మేం కూడా అట్లనే చేస్తే మీ పరిస్థితి ఏమిటని తెలంగాణ పరిస్థితి ఏమిటి ఒక్క సారి ఆలోచించాలని హితవు పలికారు. మేం పార్టీలకు అతీతంగా గెలిచిన ఎంపీలకు నిధులిస్తున్నా మని, అన్ని రాష్ట్రాలను సమానం గా చూస్తున్నామని, మేం కూడా మీలాగే వ్యవహరిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, ప్రజలు నష్ట పోతారని సూచించారు. అందుకే మాకు ఆ ఆలోచన లేదు. రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని కలిస్తే పూర్తిగా సహకరిస్తున్నామని, నిధులిస్తున్నా మని మా మంచి తనాన్ని పిరికిత నంగా భావిస్తే మీకే నష్టమని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.అందుకే కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీల ఎమ్మె ల్యేలను సమానంగా చూడా లని, నిధులివ్వాలని, ఒకవేళ ఇంకా వివక్ష చూపితే మీకే నష్టమనే సంగతి మర్చిపోవద్దన్నారు. ఇకనై నా ఇట్లాంటి వ్యవహార శైలిని మా నుకోవాలని, అందరినీ సమాన ద్రుష్టితో చూడాలని కోరారు.

గతం లో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఇదే విధానాన్ని అమలు చేస్తే ప్రజలు తగిన బుద్ది చెప్పారని, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ పార్టీపై తిరగబడే పరిస్థితి ఏర్పడిందని, బీజేపీసహా గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. గెలిచిన వాళ్లను వదిలి ఓడిపోయిన వాళ్లకు నిధులివ్వడం ఏ రకమైన ప్రజాస్వా మ్యమని వ్యాఖ్యానించారు.

సింగరేణి ప్రైవేటీకరణపై…

సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు (Congress, BRS party) దుష్ప్రచారం చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఇట్లనే దుష్ప్రచారం చేస్తే ప్రజలు బుద్ది చెప్పారు. నాడు బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.

జనసేన పొత్తుపై స్పందిస్తూ..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన ప్రతిపాదనను బీజేపీ ముందుంచారని, దీనిపై జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్య క్షులు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందే తప్ప బండి సంజయ్ (Bandi Sanjay)చెబితేనో ఇంకొకరు చెబితేనో పొత్తపై నిర్ణ యం తీసుకునే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు. చివరగా టీ 20 విజయంపై స్పందిస్తూ టీ 20 ప్రపంచ కప్ లో భారత్ విజయం సాధించడం సంతోషకరమని వ్యా ఖ్యానించారు. దేశంలో 140 కోట్ల మంది ఆనందంతో ఉన్నారన్నారు. భారత్ గెలవాలని ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా కోరుకున్నారని, ఈ దేశమ్మీద భక్తిభావం ఉన్న వారంతా టీవీల్లో వీక్షించారని, ప్రతి భారతీ యుడు తానే గెలిచినట్లుగా సంతో షపడుతున్నడని, ఇంత గొప్ప విజయాన్ని అందించిన భారత టీంకు (indian team) శుభాకాంక్షలు తెలిపారు. గతంలో రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన స్మ్రుతులను గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానిం చారు.