— నల్లగొండ జిల్లా బీసీ సదస్సులో ప్రముఖుల పిలుపు
BC conference: ప్రజా దీవెన, నల్లగొండ : భారతదే శంలోని మిగతా రాష్ట్రాలను ఆద ర్శంగా తీసుకొని బీసీలు రాజకీయ పార్టీలు స్థాపించి రాజ్యాధి కారంలో కి రావాలని, రాజ్యాధికారమే నిజ మైన ఆత్మగౌరవమని బీసీ ఇంటలె క్చువల్స్ ఫోరం చైర్మన్, మాజీ కలె క్టర్ ఐఏఎస్ అధికారి టి చిరం జీవు లు పిలుపునిచ్చారు. శనివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నల్లగొం డ శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీ వో భవన్ లో శ్రీకాంతాచారి ప్రాంగ ణం లో ‘ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అనే అంశంపై సదస్సు జరి గింది. ఈ సదస్సు కు ఆయన ము ఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బీహార్ లో బీసీలైన యాదవు లు కురుమలు రాజకీయ పార్టీలు స్థా పించి, తమిళ నాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాది పార్టీ ద్వారా బీసీలు స్థాపించి రాజ్యాధికా రం సాధించారని ఆయన చెప్పారు తమిళనాడులో బీసీలు పరిపాలి స్తుండడం వల్లనే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తల సరి ఆదాయం అందరికీ సమానం గా పెరిగిందని తెలిపారు బీహార్లు జనతదళ్ ఆర్జెడీలు సుదీర్ఘంగా పరి పాలిస్తూ బీసీల ఆత్మగౌరవ బహు ట ఎగురవేస్తున్నారని చెప్పారు. ఒక్క తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో తప్ప బీసీలు అన్నిచోట్ల అధికారంలో కొనసాగా లని ఆయన విపులంగా వివరించా రు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలంగాణలో సాయుధ రై తాంగ పోరాటం నక్సల్ బరి పోరా టం తెలంగాణ ఉద్యమం జల్ జం గల్ జమీన్ పేరిట జరిగిన ఆదివాస ఉద్యమాలు జరిగాయని ఇకముం దు బీసీ ఉద్యమం ఒక్కటే జరగా ల్సి ఉందని ఆయన హితువు చె ప్పారు. వెస్ట్ బెంగాల్లో బ్రాహ్మణుల పరిపాలన వల్ల ఆ రాష్ట్రంలో ఇప్ప టివరకు అభివృద్ధి సాధించలేదని
గుర్తు చేశారు.
బ్రిటిష్ వారు పరిపాలించిన కాలం లో మనకు సమానత్వం సంప్రదాత్ర త్వం పరిచయం చేసినప్పటికీ ఆ త్మగౌరవం కోసం స్వపరిపాలన కోరుకున్నామని సందర్భంగా గుర్తు చేశారు. అగ్రకులాలు చేసే ఉద్య మంలో చురుకుగా పాల్గొంటూ బీసీ ల ఆత్మ అభిమాన ఉద్యమంలో వె నుకబడుతున్నామని ఆవేదన వ్య క్తం చేశారు. తక్కువ జనాభా ఉన్న రెడ్లు వెలుమలు కమ్మల నుంచి అ ధిక శాతం ఎమ్మెల్యేలు ఎన్నికవుతు న్నారని అధిక జనాభా ఉన్న బీసీల నుంచి తక్కువ శాతం ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారని లెక్కలతో సహా వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమ లు చేసి ఎన్నికలకు పోవాలని లేని పక్షంలో ఎన్నికల్లో యావత్ తెలం గాణ బీసీలు కాంగ్రెస్ పార్టీకి గుణ పాఠం చెబుతారని చెప్పారు. ప్రజా ఉద్యమం ముందు ఎంతటి కఠిన మైన సర్కార్ అయినా మెడలు వం చాల్సిందేనని తెలంగాణాలో బీసీ లు పోరాటం చేసి కుల గణన సా ధించుకున్నారని అదే విధంగా 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు మాట్లా డుతూ బీసీలు రాజకీయ పరిజ్ఞానం పెంచుకొని రాజకీయ పార్టీల ద్వారా
రాజ్యాధికారం సాధించాలని పిలు పునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో త మిళనాడు పెరియార్ తరహాలు బి సి పోరాటాలు చేస్తామని చెప్పారు. బీసీలు రాజ్యాధికార పిలుపునిచ్చా రు. పోరాటంలో పాల్గొనాలని మరో మాజీ ఐఏఎస్ అధికారి సొల్లేటి ప్ర భాకర్ మాట్లాడుతూ బీసీలు ఉద్య మ చైతన్య తో దూసుకెళ్లాలని పో రాటాలు మరింత విస్తరింప చేయా లని సూచించారు.
ప్రముఖ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బీసీలు చైతన్యవంతం కావాలని బీసీలు చైతన్యవంతమవుతూ రాజకీయ పోరాటాలు విస్తరించా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత బీసీ ఇంటలెక్షన్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు పాలకూరి అశోక్ గౌడ్ వహించగా ఈ కార్యక్రమంలో కోరు కమిటీ సభ్యులు చామకూర రాజు, కెవి గౌడ్, చెన్నా శ్రీకాంత్ కొండల్ గౌ డ్ అవ్వరు వేణులతో పాటు నల్గొం డ జిల్లాకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలు తరాల పరమేష్ యాదవ్, సమీర్ కుమార్, నకరికం టి కాశయ్య, పందుల సైదులు, రా మరాజు, రాఘవేంద్ర కళాశాల శంక ర్ గౌడ్, మల్లయ్య ముదిరాజ్, తాం డ కృష్ణ కౌండిన్య తదితరులు పాల్గొ న్నారు.