–రైతుల అభిప్రాయ సేకరణలపై అ సెంబ్లీలో అందరి ముందుoచుతాం
–అసెంబ్లీలో చర్చ అనంతరమే రైతు భరోసాపై నిర్ణయం
–అదిలాబాద్ అభిప్రాయసేకరణ లో డిప్యూటీ సీఎం భట్టి, హాజరైన మంత్రులు తుమ్మల, పొంగులేటి, సీతక్కలు
Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా (Farmer’s Assurance) అమల్లో భాగంగా చేపడుతున్న ప్రజాభిప్రాయ సేకరణ పై అసెంబ్లీలో అన్ని చర్చిస్తామని, క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలు పూర్తిస్థాయి మార్గదర్శకా లతో రైతుభరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రం లోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరా రుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబి నెట్ సబ్ కమిటీ సేకరించింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగు లేటి శ్రీని వాస్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, శాసనస భ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైన రైతు భరోసా పథకాన్ని ప్రజాక్షే త్రంలో రైతుల అభిప్రాయాలకు అను గుణంగా పక డ్బందీగా అమలు చేసి తీరుతుందన్నారు.
అన్ని జిల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committee) పర్యటించి ప్రజా క్షేత్రంలో అభి ప్రాయాలు సేకరించి ఈ అసెంబ్లీలో నివేదిక పొందుపరుస్తా మని అన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా పేద బడుగు వర్గాల రైతులకు న్యాయం చేసేదిగా ఉండా లని విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. రైతు భరోసా సాయంపై ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదని, గ్రామం యూనిట్ గా తీసుకోవాలని ఎక్కువ మంది రైతులు సూచిస్తున్నారని పేర్కొన్నారు. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసు కుంటామన్నారు. రైతులకు (farmers)పంటల పెట్టుబడి సాయం కింద రైతుభరోసా ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు తమ ప్రభుత్వం దృఢసంక ల్పంతో ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలి పారు. అలాగే రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతుభ రోసా అమలుపై విధివిధానాల రూపకల్పన చేస్తామన్నారు. అందుకోసమే తమ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియ మించినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మాట్లాడుతూ నిజ మైన రైతులకే రైతు భరోసా అందిం చేందుకు అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ఆలోచనల మేరకు అర్హులైన చిన్న, సన్న కారు రైతులకు రైతుభరోసా అందిస్తా మన్నారు.రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (State Revenue Minister Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ నిజమైన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుం టుందని తెలిపారు. మరో 8 ఉమ్మ డి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రా యాలు సేకరిస్తామన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.బడ్జెట్లో 20 శాతం నిధులు జిల్లాకు కేటాయిం చాలి: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో 80 శాతం రైతులు వర్షా ధారంపైనే పంటలు సాగు చేసి నష్టపోతున్నారని. కాంగ్రెస్ ప్రభు త్వం రావడానికి ముందు వరుసలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యే కంగా ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ అమలు చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్సా గర్ కోరారు. బడ్జెట్లో 20శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ అన్ని వర్గాల రైతులను ఆదుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకంతో చేరువయ్యారని, ఈ పథకంలో ఆంక్షలు విధించవ ద్దని కోరారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులకు విపత్తు సమయం లో పరిహారం అందించే ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, రైతుల ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. బడా పారిశ్రామికవేత్తలకు, మూడు పంటలు సాగు చేసే పెద్ద బస్సును రైతులకు పంట పెట్టుబడి సాయం అందించకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 10 ఎకరాలు సాగు చేసే రైతులంద రికీ రైతు భరోసా అమలు చేయాలని కోరారు.
పది ఎకరాల వరకే ఇవ్వాలి
రైతు భరోసా (rythu barosa) బడా రైతులకు వద్దని, 10 ఎకరాల పరి మితి విధించందని పలువురు రైతులు ఈ సమావే శంలో సూచించారు. ప్రభుత్వం అందించే పంట పెట్టు బడి సాయం రాష్ట్ర ఆర్థిక భారం దృష్ట్యా పెద్ద రైతులకు పక్కనపెట్టి పేద, దళిత గిరిజన రైతులకు అందించా లని పలువురు రైతులు కోరారు. మెస్రం జంగు అనే గిరి జన రైతు మాట్లాడుతూ.. వర్షాధారంపైనే తాము పంట సాగు చేస్తున్నామని. ఖర్చులు పోను ఏమీ మిగలడం లేదన్నారు. కౌలు రైతులకు కూడా సగం వంతు, మిగి లిన సగం ఆర్థిక సాయం పట్టా రైతులకు అందించా లని కోరారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సర్కారు పంటల సాయం నిలుపుదల చేయాలని, రియల్ ఎస్టేట్ భూములు, సాగుకు పనికిరాని బీడు భూములకు కూడా పంటల పెట్టుబడి సాయాన్ని ఆపివే యాలని ప్రకాష్, గుణవంతు అనే రైతులు కోరారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క ఎంపీ గౌడెం నగేష్ శాస నసభ్యులు అనిల్ జాదవ్, రామారావ్ పటేల్, హరీష్ రావు, వెద్మా బొజ్జు, పెద్దపల్లి ఎంపీ వంశీ, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.