Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhoobharati Outreach : విస్తృత స్దాయిలో ప్ర‌జ‌ల చెంతకు భూభార‌తి

–భూ భారతికి అనూహ్య స్పందన
–72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు పూర్తి
–555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి
–భూ స‌మ‌స్య‌ల‌పై 11, 630 ద‌ర‌ ఖాస్తుల స్వీక‌ర‌ణ‌
–ఈ నెల 5వ తేది నుంచి జిల్లా కొ క్కటి చొప్పున 28 మండలాలలో భూ భారతి
–మార్పుకు నాంది భూ భారతి అం టున్న మంత్రి పొంగులేటి

Bhoobharati Outreach :ప్రజా దీవెన, హైద‌రాబాద్: తెలం గాణ రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌లు శాశ్వ‌త ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా గ‌త నెల 14వ తేదీన అంబేద్క‌ర్ జ‌ యంతి సంద‌ర్బంగా చారిత్రాత్మ‌ క‌మైన భూభార‌తి చ‌ట్టాన్ని తెలం గాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమలులోకి తీసుకువ‌చ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రిజి స్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌కు ఏమాత్రం ఆటం కం క‌ల‌గ‌కుండా ఉండేలా పైల‌ట్‌గా ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి, కామా రెడ్డి జిల్లా లింగంపేట, నారాయ‌ ణ్‌ పేట్ జిల్లా మ‌ద్దూర్, ములుగు జి ల్లా వెంక‌టాపూర్ నాలుగు మండ‌ లాల్లో పూర్తి స్ధాయిలో అమ‌లు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మం త్రి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో ఈ చ‌ట్టంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ప్రతి రోజు ఒక మండ‌లంలో రెండు గ్రా మాల్లో అవ‌గాహ‌న స‌ద‌స్సులు ని ర్వ‌హిస్తోందని, ఈ రెండు స‌ద‌స్సు ల్లో క‌లెక్ట‌ర్లు స్వ‌యంగా పాల్గొనాల‌ ని ఆదేశించినట్లు తెలిపారు. ఇం దుకోసం మండ‌ల స్ధాయిలో త‌హ‌ శీల్దార్ డిప్యూటీ త‌హ‌శీల్దార్ ఆ ధ్వ‌ర్యంలో ఆరుగురు స‌భ్యుల‌తో రెండు బృందాల‌ను ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు ఆ యన మాటల్లోనే..

ఈ భూభార‌తి చ‌ట్టం రైతులకు అ ర్ధ‌మ‌య్యే విధంగా చ‌ట్టాన్ని అమ‌ లు చేసే అధికారుల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించింది. భూభార‌తి చ‌ట్టం ను స‌వాల్‌గా తీసుకొని విస్తృత స్ధాయిలో జిల్లా ల్లో ప‌ర్య‌టించి రోజుకు రెండు, మూడు అవ‌గాహ‌నా స‌ద‌స్సుల‌లో స్వ‌యంగా పాల్గొన్నాo. ఏప్రిల్ 17 వ తేదీనుంచి 30వ తేదీవ‌ర‌కు దా దాపు 20 జిల్లాల్లో సుమారు 45 స‌ ద‌స్సుల‌లో పాల్గొన్నారు.

నాలుగు పైల‌ట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ 17 వ తేదీ నుంచి 30వ తేదీవ‌ర‌కు రెవె న్యూ స‌ద‌స్సుల‌ను పూర్తిచేశారు. ఈ స‌ద‌స్సుల్లో చ‌ట్టంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే మ‌రోవైపు ఆయా మండలాల్లో భూస‌మ‌స్య‌ ల‌పై ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రశీ దు అందజేశారు. ఒక ప్రత్యేక ఫా ర్మాట్ లో తయారు చేసిన దరఖా స్తులను రెవెన్యూ సదస్సుకు ముం దు రోజే ప్రజలకు అందించారు.

లింగంపేట‌లో 3,702, వెంక‌టా పూర్‌లో 3,969, మ‌ద్దూర్‌లో 1,3 41, నేల‌కొండ‌ప‌ల్లిలో 2,618 మొ త్తం 11, 630 ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌ రించారు. ఇందులో ప్ర‌ధానంగా పీ పీబీకి సంబంధించి 3,446, సాదా బైనామాలపై 2,796 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. వచ్చిన దరఖాస్తులన్నిం టిని ఏరోజుకు ఆరోజు కంప్యూట ర్ లో నమోదు చేసి సంబంధిత అ ధికారులకు పంపించారు. మండు టెండ‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ఈ స‌ద‌స్సు ల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ మి నహా 605 మండలాలకు గాను 55 5 మండలాలలో బుధవారం నాటికి సదస్సులు పూర్తి అయ్యాయి.

వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి జూన్ 2వ తేదీ నాటికి ఆ నాలుగు మండ‌లాల్లో భూ స‌ మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. మ‌రోవైపు హైదరాబాద్ మిన‌హా మిగిలిన 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండ‌లాన్నిపైల‌ట్ గా తీసుకొని 28 మండ‌లాల్లో పూర్తిస్ధాయిలో భూ భార‌తి చ‌ట్టాన్ని అమ‌లు చేయా ల‌ని నిర్ణ‌యించింది.

మార్పుకు నాంది : మంత్రి పొంగులేటి
“ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్ర‌భుత్వం దార్శ‌నిక‌త‌తో తీసుకువ‌చ్చిన భూ భార‌తి చ‌ట్టం విప్ల‌వాత్మ‌క మార్పు కు నాంది ప‌ల‌క‌బోతోంది. నూటికి నూరు శాతం ప్ర‌జ‌లే కేంద్ర బిందువు గా ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా రై తు సంక్షేమమే ల‌క్ష్యంగా ఈ చ‌ట్టం ఉంది. ఈచ‌ట్టానికి ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. జిల్లాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంలో త‌మ భూ స‌మ‌స్య‌లు ఈ భూభార‌ తి చ‌ట్టంతో ప‌రిష్కార‌మ‌వుతా య‌ నే న‌మ్మ‌కం, విశ్వాసాన్ని రైతులు వ్య‌క్తం చేశారు. ధ‌ర‌ణితో వారు అ నుభ‌వించిన క‌ష్టాల‌ను, బాధ‌ల‌ ను వ్య‌క్తం చేశారు. ధరణి తో వారు ఎ దుర్కొన్న సమస్యలను చెప్తుంటే వారు పడ్డ కష్టం కళ్ళముందే కని పించింది. రైతుల భూ సమస్యల ను వీలైనంత త్వరితగతిన పరి ష్కరించడానికి అధికార యంత్రాం గాన్ని సంసిద్ధం చేశాం. ఇకనుండి రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగా ల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయంలోనే వాళ్ళ సమస్య కు పరిష్కారం లభిస్తుంది. ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా ఖ ర్చు పరిష్కరించే విధానం నిరం తరం కొనసాగుతుంది. ఈ పైలట్ నాలుగు మండలాలలో కోర్టు పరి ధిలో ఉన్న భూ సమస్యలు మిన హా అన్ని సమస్యలను జూన్ 2వ తేదీ నాటికి పరిష్కరిస్తాం. ఆ నాలు గు పైలట్ మండలాల మాదిరిగానే ఈ నెల 5వ తేది నుంచి రాష్ట్రంలో ని 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండ లంలో పూర్తి స్థాయిలో భూ భార తిని అమలు చేస్తున్నాం.

చ‌ట్టం తీసుకువ‌స్తే స‌రిపోదు, ఆ చ‌ట్టం పూర్తి స్దాయిలో అమ‌లు జ‌రిగిన‌ప్పుడే రైతుల‌కు నిజ‌మైన న్యాయం ల‌భిస్తుంది. ఆ దిశ‌గా మా ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుం టుందని మంత్రి పొంగులేటి శ్రీనివా స రెడ్డి అన్నారు