Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bible Training: వేసవి సెలవులు బైబిల్ శిక్షణ తరగతులు ముగింపు : లక్ష్మీ నారాయణ రెడ్డి

దేశ త్రివిధ దళాల క్షేమం కొరకు చిన్నారుల ప్రత్యేక ప్రార్థనలు.
*విద్యార్థులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదగాలి: లక్ష్మీ నారాయణ రెడ్డి

Bible Training: ప్రజా దీవెన కోదాడ కోదాడ పట్టణంలో స్థానిక బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు బైబిల్ శిక్షణ తరగతులు నిర్వహించారు శుక్రవారంతో ముగిశాయి ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత ఐదు రోజులుగా బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన బైబుల్ శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మిక భావాలతో ఎదిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని తెలిపారు అలాగే ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న భారత త్రివిధ దళాలకు సంబంధించిన సైనికుల కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించటం అభినందనీయమని తెలిపారు యావత్ భారత దేశ ప్రజలు మన సైన్యానికి మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు చర్చిలో గత ఐదు రోజులుగా బైబిల్ వేసవి తరగతులలో ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చారని తెలిపారు
ఈ కార్యక్రమంలో సినియర్ కాంగ్రెస్ నాయకులు వంటిపులి వెంకటేష్, కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ మాజీ సభ్యురాలు వంటిపాక జానకి యేసయ్యా గుండెపోంగు రమేష్ టీచర్లు ద్రాక్షవల్లి, తబిత,రాణి,సుధా, పావని, ప్రజ్వలిత, నాన్సీ రమ్య, జీవని, లిన్సీ, రాంబాబు ఎనోచ్ తదితరులు పాల్గొన్నారు