Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pharma Sector US : బిగ్ బ్రేకింగ్, ఫార్మా రంగంలో మరో మైలురాయి, రూ.9 వేల కోట్ల పెట్టు బడులకు అమెరికా కంపెనీ అంగీకారం 

Pharma Sector US : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆక ర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫా ర్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ను హై దరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్ర కటించింది. ఈ యూనిట్ ఏర్పాటు కు ఒక బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడుల కు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో ఎల్ లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తం గా తమ ఔషధాల సరఫరా సామ ర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవా రం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎల్ లిల్లీ కంపెనీ ప్రతిని ధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుక ర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కు మార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ చర్చల అనంతరం ఎల్ లిల్లీ కం పెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తె లంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహ కారంతో దేశంలో అధునాతన త యారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్న ట్లు ప్రకటించింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్షరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎల్ లి ల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్షరింగ్ నెట్వ ర్క్కు సాంకేతిక పర్యవేక్షణ, నాణ్య త నియంత్రణ, అధునాతన సాంకే తిక సామర్థ్యాలను అందించనుంది.

కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రం తో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభా వంతులకు ఉద్యోగావకాశాలు లభి స్తాయి. వీలైనంత తొందరలోనే కెమి స్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపు ణులు, ఇంజనీర్ల నియామకాలు చే పట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అమెరికాకు చెందిన ఎ ల్ లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపం చ వ్యాపంగా ఔషధాల తయారీ రం గంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొ లిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అ ధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది.

ప్రధానంగా డయాబెటిస్‌, ఓబెసిటీ, ఆల్జీమర్‌, క్యాన్సర్‌, ఇమ్యూన్ వ్యా ధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ ప ని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎల్ లి ల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి. హైదరాబాద్లో ఈ ఏడాది ఆగస్ట్లోనే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ ను ప్రా రంభించింది.

విస్తరణలో భాగంగా ఎల్ లిల్లీ కం పెనీ బారీ పెట్టుబడులకు ముందు కు రావటం ఆనందంగా ఉందని, తె లంగాణకు ఇదొక గర్వ కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అ న్నారు. తెలంగాణపై నమ్మకం ఉం చినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరా బాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మ హ బ్ గా పేరొందిందని, ఇప్పుడు ప్రపం చం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. 19 65లో ఇందిరాగాంధీ హైదరాబాద్ కు ఐడీపీఎల్ తీసుకు వచ్చినప్పటి నుంచి ఫార్మా రంగం విస్తరించిందని అన్నారు. పేరొందిన దిగ్గజ ఫార్మా కంపెనీలుండటంతో 40 వాతం బ ల్క్ డ్రగ్స్ హైదరాబాద్ లోనే ఉత్ప త్తి అవుతున్నాయని అన్నారు. కోవి డ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చే సిన విషయాన్ని గుర్తు చేశారు. ఫా ర్మా కంపెనీలను ప్రోత్సహించే ఫా ర్మా పాలసీని ప్రభుత్వం అనుసరి స్తుం మదని చెప్పారు. జీనోమ్ వ్యా లీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తు న్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సి న సాంకేతిక సహకారం అందిస్తామ ని చెప్పారు.

హైదరాబాద్ లో ఎల్ లిల్లీ కంపెనీ వి స్తరణ తెలంగాణలో పరిశ్రమల విస్త రణ తీరును ప్రతిబింబిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయప డ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావం తులకు ఉపాధి, ఉద్యోగ అవకాశా లు మెరుగుపరుస్తుందని అన్నారు. ఎల్ లిల్లీ విస్తరణ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అందిస్తుందని, ఇప్ప టికే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగా ణ వేగవంతమైన వృద్ధి సాధిస్తోంద ని అన్నారు.