Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, కంచ గచ్చిబౌలిపై కుట్ర లపై పగడ్బందీ కేసులు

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో కలకాలం సృష్టించిన గచ్చి బౌలి భూముల వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారే పరిస్థితి కనపడుతుంది. వివాదాన్ని పరిష్క రించే దిశగా ఓవైపు ప్రభుత్వం ప్ర యత్నిస్తూనే వివాదానికి కారణ మైన సోషల్ మీడియా పై నిశిత దృష్టి సారించింది. సామాజిక మా ధ్యమాలపై ఉక్కు పాదం మోపేం దుకు రంగం సిద్ధం చేస్తుంది. ఫేక్ వీ డియోలు, ఏఐ వీడియోలతో రచ్చ చేసిన వారిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూ ముల వ్యవహారంలో తప్పుడు ప్ర చారం చేసి, ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలతో రచ్చ చేసిన వారిపై కేసులు పెట్టేందుకు తెలంగాణ ప్ర భుత్వం సిద్ధమవుతోంది. జాతీయ స్థాయి యూట్యూబర్లు కూడా త ప్పుడు ప్రచారాలు చేశారు. తుప్ప లుగా మారిన ప్రాంతాన్ని చిట్టడవి గా అక్కడ జింకలు, నెమళ్లు తిరు గుతున్నట్లుగా ప్రచారం చేశారు. నా లుగు వందల ఎకరాల ప్రాంతం.. ఎ ప్పటికప్పుడు జనం తిరిగే ప్రాంతం లో జింకలు ఉంటాయా అనే కనీస లాజిక్ ను ఎవరూ పట్టించుకో లే దు. కానీ ఈ విషయంలో ఓ పెద్ద ఫేక్ ఫ్యాక్టరీ పని చేసిందని అర్థం చేసుకోవచ్చు.

భయంకరమైన ఫేక్ ప్రచారా లు ? … అర్థరాత్రి వేళ రోడ్డుపై సెంట్రల్ వర్శిటీ ఎదురుగా ఉండే పాత ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న కొన్ని కన్‌స్ట్రక్షన్ లారీల వీ డియోలను చూపించిన ఓ జాతీ య మీడియా జర్నలిస్టు అందులో కంచ గచ్చిబౌలి స్థలంలో కొట్టేసిన చెట్లను తీసుకెళ్తున్నారని స్టూడెం ట్స్ చెప్పారని రాసుకొచ్చారు.

గచ్చిబౌలి ప్రాంతంలో గత పదే ళ్లు గా రాత్రి పది గంటల నుంచి ఉద యం వరకూ అలాంటి లారీలు కొ న్ని వందలు తిరుగుతూ ఉంటా యి. కన్‌స్ట్రక్షన్ కోసం మెటీరియల్స్ తీసుకెళ్లడం.. తవ్వేసిన రాళ్లను తీ సుకెళ్లడం వంటివి చేస్తూంటాయి.

అలాంటి లారీలను చూపించి కూ డా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ జర్నలిస్టుకూ ఆ విషయం తెలు సు. కానీ వారికి కావాల్సింది ఫేక్ ప్ర చారాన్ని జనంలోకి పంపడమే.
ఇప్పుడు జింకలు పెద్ద ఎత్తున ఉ న్నాయని ప్రచారం చేస్తున్నారు.

ఇదిగో జింక, అదిగో జింక అని వీ డియోలు పెడుతున్నారు. నాలుగు వందల ఎకరాలు అంటే గట్టిగా ఓ కాలనీ అంత కూడా ఉండదు. పైగా అదేమీ నిర్మానుష్య ప్రాంతం కాదు. జింకలు అక్కడ పెరగడానికి అవకా శమే లేదు. ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న జింకలు, చిన్నవి కూడా కాదు. చాలా పెద్దవి. అవి ఎప్పుడు అక్కడకు వచ్చాయి, ఎప్పుడు పె రిగాయి. ఆ భూముల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటా రు. డంపింగ్ గ్రౌండ్ గా కూడా కొంద రు వాడుకుంటున్నారు. మరి జింక లు ఎలా పెరిగాయి, మొత్తం ఓ పెద్ద ఫేక్ ప్యాక్టరీకి తోడు ఊహించనంత కుట్ర ఈ వ్యవహారంలో కనిపిస్తోం దన్నది అధికార పార్టీ వాదన.

కంచగచ్చిబౌలి భూముల్ని వేలం వేయకుండా అడ్డుకోవాలంటే ప ర్యావరణం పేరుతో రచ్చ చేయడ మే మార్గమని మొదటి నుంచి సో షల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానికి తగ్గట్లుగా నే పక్కా ప్లాన్ ప్రకారం జింకల్ని కూ డా తెచ్చి రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ఎదుర్కో వడంలో పూర్తిగా విఫలమయింది. ఇంటలిజెన్స్ కూడా ఏం చేయలేక పోయింది. ఈ విషయంలో ప్రభు త్వానిదే ఎక్కువ లోపం కనిపిస్తోం దని అనుకోవచ్చు.