Big Breaking :ప్రజా దీవెన, శ్రీనగర్ : ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ను భారత బలగాలు జల్లెడ పడు తున్నాయి. నిఘా వర్గాలు కూడా ఉగ్రవాదుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కు ప్వారా జిల్లాలో ఉగ్రవాదుల కదలి కలను నిఘా వర్గాలు పసిగట్టాయి. నిఘా వర్గాల ఆదేశాలతో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఆర్మీ బలగాలు కలిసి సంయుక్తంగా మాచిల్ జిల్లా లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూంబింగ్లో భాగంగా ఉగ్రవాదులు భారీ స్థాయిలో దాచిన ఆయుధా లు, పేలుడు పదార్థాలను స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. ఏకే 47 తుపాకులు, మేగజైన్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసు కున్నారు.
ఐదు ఏకే-47 రైఫిల్స్, ఎనిమిది ఏ కే-47 మేగజైన్లు, ఒక పిస్తోల్, మరో పిస్తోల్ మేగజైన్, 660 రౌండ్ల బుల్లె ట్లతో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నా రు. కుప్వారా జిల్లాలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని వి ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోం ది. నిఘా వర్గాల అప్రమత్తం కావ డంతో ఉగ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకుని, అల్లర్లకు అడ్డు కట్ట వేశారు.