Big Breaking :ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్ని కలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయ కేత నం ఎగురవేశారు. ఎమ్మెల్సీ ఎన్ని కల ఓట్ల లెక్కింపులో ఆయనకు 63ఓట్లు రాగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో భాజపా, ఎంఐఎం మాత్రమే పోటీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో 38 ఓట్ల తేడాతో మీర్జా హసన్ గెలుపొందారు. దీం తో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎం కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా హైదరాబాద్ స్థాని క సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏ ళ్ల తర్వాత ఎన్నిక జరిగింది. బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఈ ఎన్నికల చర్చనీ యాంశంగా మారింది. ఈనెల 23న ఎన్నిక జరిగింది. ఇక్కడ మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. అ త్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా ఆ తర్వాతి స్థానంలో బీజేపీ ఉంది. ఎంఐఎంకు 49 ఓట్లు ఉండగా ఇత ర పార్టీల మద్దతు లభించడంతో ఎన్నికల్లో ఎంఐఎం సునాయాసం గా విజయం సాధించింది.