Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, నేడు మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy  : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం ఢిల్లీలో పర్య టనకు బయలుదేరనున్నారు. రెం డు రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించేందుకు వెళ్తున్నా రు. ఈ పర్యటనలో బాగంగా పలు వురు కేంద్రమంత్రులను కలవను న్నారు. మధ్యాహ్నం 2.30కి కేంద్ర క్రీడలు, కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానుoడగా తెలంగాణ రాష్టా నికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం చర్చించనున్నారు. అనంతరం కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాను కలిసి మాట్లాడను న్నారు.రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని కోరనున్నారు.

అదే విధంగా బనకచర్ల అంశంపై మ రోసారి కేంద్రమంత్రిని కలిసి చర్చిం చనున్నారు. ఇప్పటికే బనకచర్ల అ నుమతులని పర్యావరణ కమిటీ ని రాకరించిన విషయం తెలిసిందే. మరోసారి బనకచర్ల ప్రాజెక్ట్‌ని అడ్డు కునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. తెలంగాణకు పెం డింగ్‌లో ఉన్న నిధులపై కేంద్రమం త్రులను కలవనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలతో నిధుల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుoచనున్నారు. 42 శాతం రిజర్వేషన్‌ ఆమోదంపై కేంద్ర ప్రభు త్వ పెద్దలతో సీఎం చర్చించనున్నా రు. విభజన సమస్యలు పరిష్కారా నికి ఢిల్లీ పెద్దలతో భేటీ కానున్నా రు. ఇప్పటికే డిల్లీ పర్యటన ఖరారు అయినందున సీఎం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లనున్నారు.