Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP Nalini : బిగ్ బ్రేకింగ్, తెలుగురాష్ట్రాల ప్రజల కు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ, ఆ ధ్యాత్మిక వేత్తగా సాగిన నాజీవితం ముగియబోతోంది

DSP Nalini : ప్రజా దీవెన,హైదరాబాద్: తెలంగా ణలో ఒక పోలీస్ అధికారిణిగా, ఉ ద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆ ధ్యాత్మిక వేత్తగా సాగిన నాజీవితం ముగియబోతోంది… నాఆరోగ్య పరి స్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది..ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను..మూడు (3)రోజుల నుండి నిద్ర లేదు.. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. ఎనిమిది (8) ఏండ్ల క్రితం సోకిన Ruematoid ar thritis అనే విలక్షణ కీళ్ల జబ్బు ( B lood cancer+ Bone Cancer) నెలలుగా టైపాయిడ్, డెంగ్యూ, చి కెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్రస్థాయికి చేరింది. కనకణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకా కీలువిరిచేసినట్లు నొప్పి తట్టుకోలేక పోతున్నాను. అని తె లుగురాష్ట్రాల ప్రజలకు డీఎస్పీ నళి ని బహిరంగ లేఖ రాసింది.

డీఎస్పీ నళిని లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది. తెలంగాణ ఉధ్యమం లో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ న ళిని గురించి ఎంత చెప్పుకున్నా త క్కువే. స్వరాష్ట్రం కసం తన ఉద్యో గాన్ని సైతం వదులుకుంది. ఉద్య మంలో పాల్గొన్నందుకు నాటి ప్రభు త్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజా గా నళిని ఆరోగ్యానికి సంబంధించి న విషయం అందరినీ షాక్ కు గురి చేసింది. చావు బతుకుల మధ్య న ళిని కొట్టు మిట్టాడుతోంది. ఈ క్ర మంలో తన అనారోగ్యంపై ఫేస్ బు క్ లో పోస్ట్ చేసింది. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ (వీలునామా, మరణ వాం గ్మూలం) రాసింది.

2018 లో ఈ జబ్బు ప్రారంభం అ యినప్పుడు ఇలాంటి స్థితియే ఏర్ప డ్డపుడు,మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెం టర్ లో నెలల తరబడి ఉంటూ న న్ను నేను బాగుచేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పో యేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు. 25 ఏండ్ల క్రిత మే నా శరీరం నాన్ స్టెరాయిడల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సె న్సిటివ్ గా మారిపోయింది. నేను ఫార్మసిస్టు ను కూడా. కాబట్టి అలో పతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. క నుక 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చే రి నా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయు ర్వేదమే వాడుతూ, యోగ, ధ్యా నం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్ర భావమే రకరకాల ఆరోగ్య రుగ్మత లు చుట్టుముట్టాయి.

ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరి స్థితిని ప్రమాద స్థాయి కి చేర్చాయి.

నా గతమంతా వ్యధ భరితం. తెలం గాణ ఉద్యమ పోరాటం వల్ల నా ని లువెల్లా గాయాలే అయ్యాయి. రా జీనామా ద్వారా నాటి ప్రభుత్వం ప న్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో స స్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరాదిం పింది. సహాయం చేసేవాడు కనిపిం చక, నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అ జ్ఞాతవాసాన్ని అనుభవించాను. మ హర్షి దయానందుని దయవల్ల ఒక

చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొ ని, అందులో విశేషమైన కృషి చే స్తూ యజ్ఞ బ్రహ్మగా VYPS (వేద యజ్ఞ పరిరక్షణ సమితి) సంస్థాపకు రాలుగా ఎదిగి, హిందీ అభిమాను లను కూడా సంపాదించుకొని,నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నాను. నళిని మళ్ళీ వి కసించింది.

ఇలాంటి తరుణంలో నేటి CM అధి కారంలోకి రాగానే నా ఫైల్ ను ఎం దుకో తెరిచారు. నాకేదో సహాయం చే స్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పా ను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నెండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన స బ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్కకట్టి ( సు మారు 2 కోట్లు) ఇవ్వండి అని అడు గుతూ 16 పేజీల స్వీయ లిఖిత రి పోర్ట్ ను ఇచ్చాను. వీలైతే వేద వి ద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇ మ్మని అడిగాను.(రెండోది వారి పార్టీ పాలసీ కి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది). 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కను క్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తె లిసింది. నా ఆఫీస్ కాపీ ని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్ప టి వరకు స్పందన లేదు.

మీడియా మిత్రులకు విజ్ఞప్తి. నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అ ని రాయకండి.రిజైన్డ్ ఆఫీసర్, కవ యిత్రి, యజ్ఞ బ్రహ్మ అని నన్ను సం భోదించండి. నా శరీరానికి జరగా ల్సిన అంతిమ సంస్కారం వైదికం గా జరగాలి బ్రతుకుండగా నన్ను తె లంగాణ పోరాట విషయంలో ఏ నా యకుడు సన్మానించలేదు. నేను చ నిపోయాక అంటే పోస్టుమస్ అవా ర్డులు, రివార్డులు ఇవ్వడానికి బయ లుదేరే రాష్ట్ర నాయకులకు ఒక విన తి. బ్రతుకుండగా నన్ను పట్టించు కొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.

ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేం ద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే,నాకు స రైన, ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట ప డతాను. లేదంటే.. ఇంకా 3,4 పుస్త కాలు రచించాలని,100 వీఐపీ య జ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబి రాలు నిర్వహించి సనాతన ధర్మా న్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకు లుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరు పై ఉన్న ఒక్కగానొక్క ఇం టి స్థలం vyps కు చెందుతుంది. బ్ర తుకుండగా దేశ ప్రధాని ని కలవలేక పోయాను.వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీ వితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగి స్తాను అని పేర్కొంది.