Big Breaking : ప్రజా దీవెన, చత్తీస్ గడ్: ఛత్తీస్ గ ఢ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావో యిస్టులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు మహిళా నేతలు ఉండగా ఎదురుకాల్పుల్లో ఇద్దరు కీలక నేత లు సైతం మరణించగా వారి మృత దేహాలను బలగాలు స్వాధీనం చే సుకున్నాయి. ఘటనా స్థలంలో భా రీగా ఆయుధాలు, పేలుడు పదార్థా లు లభ్యమయ్యాయని బలగాలు వెల్లడించాయి.
నిన్న రాత్రి కాల్పుల తర్వాత కూడా ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్టు అధి కారులు తెలిపారు. బీజాపూర్ జి ల్లాలోని నేషనల్ పార్క్ టార్గెట్ గా ఈ ఆపరేషన్ జరుగుతోంది. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ అగ్రనేత అడెల్లి అలి యాస్ భాస్కర్ మృతిచెందగా, అం తకుముందు రోజు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మరణించిన సంగతి తెలి సిందే. అయితే తాజా ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సలైట్ల గుర్తింపును ఇంకా నిర్ధారించలేదని వెల్లడించా రు.