Rajya Sabha new nominees: ప్రజాదీవెన, న్యూఢిల్లీ: దేశంలో రా జ్యసభకు ఖాళీ అయిన స్థానాల్లో నలుగురు కొత్త సభ్యుల నియామ కానికి ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర ప తి ద్రౌపది ముర్ము తాజాగా ఆయా ఖాళీలకు నామినేట్ చేస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలు వురు సభ్యుల పదవీకాలం ముగి యడంతో వారి స్థానంలో కొత్త స భ్యులను నామినేట్ చేస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. సాహిత్యం , సైన్స్, కళలు, సామాజిక సేవ తది తర రంగాలలో విశేష సేవలందించి న ప్రముఖులను రాజ్యసభకు నా మినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్న విషయం విదితమే.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) ద్వారా సంక్రమించిన అధికారం తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజా గా లాయర్ ఉజ్వల్ నిగమ్, సదా నందన్, హర్షవర్ధన్, మీనాక్షి జైన్ లను రాజ్యసభ సభ్యులుగా నామి నేట్ చేశారు.
నామినేట్ అయిన వారిలో ఉజ్వల్ దేవరావు నికమ్.. 26/11 ముంబై ఉగ్రవాద దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.
ఇక సదానందన్ మాస్తే కేరళలో అ ట్టడుగు వర్గాలకు దశాబ్దాలుగా సే వలు అందిస్తున్న సామాజిక కార్య కర్త, విద్యావేత్త. హర్ష్ వర్ధన్ ష్రింగ్లా భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, దౌత్యవేత్త. డాక్టర్ మీనాక్షి జైన్ ప్ర ముఖ చరిత్రకారిణి, విద్యావేత్త కా వడం గమనార్హం.