Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Central Gazette Notification:బిగ్ బ్రేకింగ్, జనగణనకు జయహో, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ప్రజా దీవెన న్యూ దిల్లీ: దేశoలో జనగణనకు సంబంధించి సోమవా రం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికే షన్‌ను విడుదల చేసింది. మొత్తం గా రెండు దశల్లో జరగబోయే ఈ జ నగణన 2026 అక్టోబర్ 1న ప్రారం భమై మార్చ్ 1, 2027న ముగియ బోతోంది. ఈ మేరకు కేంద్ర హోంశా ఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్‌‌ ను విడుదల చేసింది.జనగణనకు సంబంధించి కేంద్రం గెజి ట్ నోటిఫి కేషన్‌ను (Gazette not ificati on) విడుదల చేసింది. రెండు దశ ల్లో జరగబోయే ఈ జనగణన 20 26 అక్టోబర్ 1న ప్రారంభమై మార్చ్ 1, 2027న ముగియబోతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది.

ఇది మనదేశంలో జరగబోయే 16వ జనగణన కావడం విశే షం.స్వాతంత్య్రానంతరం జరిగే 8వ జనాభా లెక్కింపుగా నిలవ బోతోంది దాదాపు ఆరు నెలల పాటు జరిగే ఈ లెక్కింపులో 34 లక్షల మంది గణకులు, సూపర్‌వైజ ర్లతో పాటు 1.34 లక్షల మంది సి బ్బంది కూడా పాలుపంచుకోబో తు న్నారు. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టబోతున్నా రు. ఇంతకు ముందులా కాకుండా ఈ సారి లెక్కింపు పూర్తిగా ట్యాబ్‌ల సహాయంతో డిజిటల్ రూపంలోనే జరగబోతోంది. సమాచారం భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుం టున్నట్టు కూడా కేంద్ర హోంశాఖ వె ల్లడించింది.అంతేకాదు ప్రభుత్వం సూచించే పోర్టళ్లు, వెబ్‌సైట్‌ల ద్వా రా ప్రజలు నేరుగా తమ వివరాల ను నమోదు చేసుకునే వెసులుబా టును కూడా కల్పించింది.

నిజానికి 2021లో ఈ జనగణన జరగాల్సి ఉంది. ఈ మేరకు 2019 లో నోటిఫికేషన్ విడుదలైంది. అ యితే కోవిడ్-19 కారణంగా ఆ జన గణనను వాయిదా వేశారు. చివరి సారి 2011లో జనాభా లెక్కింపు జరిగింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత జనగణన జరగబోతోంది.