Big Breaking:ప్రజా దీవెన, డెహ్రాడూన్: ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఇం డియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమా దం మరువక ముందే మరో దుర్ఘట న చోటు చేసుకుంది. అంత పెద్ద స్థాయిలో కాకున్నా గగనతలం లో జరిగిన తాజా విషాదకర సంఘటన గా చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ లోని గౌరీ కుండ్లో హెలికాప్టర్ కుప్ప కూ లడంతో ఏడుగురు దుర్మరణం పా లయ్యారు.
ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలి కాప్టర్ కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్నది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవ డంతో అదుపుతప్పిన హెలికాప్టర్ గౌరీకుండ్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది.దీంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడిక క్కడే మరణించారు. మృతుల్లో పైల ట్తో పాటు ఓ చిన్నారి కూడా ఉన్న ట్లు తెలుస్తున్నది. ప్రమాద సమ యంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు, పైలట్ ఉన్నారు.
అంతకు ముందే ఆ హెలికాప్టర్ గు ప్తకాశి నుంచి కేదార్నాథ్ వెళ్లిందని అధికారులు తెలిపారు. తిరిగి గుప్త కాశికి వస్తుండగా ప్రమాదం జరి గిందని తెలిపారు.ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బం దిని పంపామని, అయితే హెలికా ప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోవడంతో అక్కడికి చేరుకోవ డం కొంత ఆలస్యమవుతుందని వెల్లడించారు. ప్రమాదానికి సంబం ధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
