Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగా ణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్న వారికి తీపి కబురు అందించింది రాష్ట్ర హైకోర్టు. స్థానిక సంస్థలకు గ త ఏడాది న్నర కాలంగా రాష్ట్ర ప్ర భుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువ రించింది. మూడు నెలలలోపు ఎ న్నికలు నిర్వహించాలని జస్టిస్ మా ధవీదేవి ఆదేశించారు.
హైకోర్టులో కేసు విచారణ నేపద్యం లో కోర్టు వెలువరించిన తీర్పు పూ ర్వాపరాలు ఇలా ఉన్నాయి. నల్ల గొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పా ర్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగామ జిల్లా కాంచనపల్లి సర్పం చ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ స ర్పంచ్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయతీ గూడెం సర్పంచ్ మురళీ ధర్ వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యా యి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదే వి బుధవారం ఉదయం తీర్పు ఇచ్చారు. స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉం డాలని, పాలకవర్గాల కాలపరిమితి పూర్తికాగానే ఎన్నికలు నిర్వహిం చకపోవడం రాజ్యాంగ వ్యతిరేక మని పిటిషనర్లు వాదించారు.
రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణాలను, తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ చట్టం 2018 ని బంధనలను ప్రభుత్వం ఉల్లంఘిం చిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగు ణంగా వెనుకబడిన తరగతుల రి జర్వేషన్లను ఖరారు చేసేందుకు మ రో 30 రోజుల గడువు కావాలని ప్ర భుత్వం వాయిదా కోరింది.గత వి చారణలో కూడా ఇదే తరహాలో వా యిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడం ఏమిటని హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందకు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని, బీసీ రిజర్వేషన్లను ఖరా రు చేయడమే తమ ముందున్న అంశమని ప్రభుత్వం వివరణ ఇ చ్చింది.ప్రభుత్వం నుంచి అను మ తి లభించాక ఎన్నికల నిర్వహణ కు తమకు రెండు మాసాల వ్యవధి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ వాదనలు సోమవారం ముగియడంతో బుధవారం హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.