Big Breaking: ప్రజా దీవెన, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఈవీ ఎంలను తెరిచి లెక్కింపు చేప డుతున్నారు. మొదటి రౌండ్ ముగి సేసరికి 48 చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆప్ ప్రయత్నానికి ఢిల్లీ ఓటర్లు గండికొట్టినట్టు తెలుస్తోంది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగిరే అవకాశాలు కనిపి స్తున్నాయి.మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీ జేపీ…ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంట లకు మొదలైంది. ఎలాగైనా అధి కారం నిలబెట్టుకుని నాలుగోసారి హ్యాట్రిక్ విజయం కోసం కేజ్రీవాల్ ప్రయత్నించారు. అయితే, కాషా య పార్టీ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మెజార్టీ మార్క్ క్రాస్ చేసిన బీజేపీ..* .ఢిల్లీ శాసనసభ ఎన్నిక ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి బీజేపీ మెజార్టీ మార్క్ క్రాస్ చేసింది. ఇప్ప టి వరకు అందిన ఫలితాల సరళి ప్రకారం బీజేపీ 48, ఆప్ 21, కాం గ్రెస్ 1 చోట ఆధిక్యంలో ఉన్నాయి. శకూరి బస్తీలో జైన్ ముం దంజ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి కిందటే మొద లుకాగా.. పోస్టల్ బ్యాాలెట్ లెక్కిం పు కొనసాగుతోంది. శకూ రిబస్తీ నుంచి బరిలో ఉన్న ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ ముందంజలో ఉన్నారు.
ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ లీడ్
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగు తుండగా ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్ధి ఆది క్యంలో ఉన్నారు. బాదలి నుంచి ఆ పార్టీ తరఫున పోటీచేసిన దేవేంద్ర యాదవ్ ముందంజలో ఉన్నారు.పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి ఆధిక్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా.. ఇందులో బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ పార్టీ 32 చోట్లు, ఆప్ 25 స్థానాల్లో ఆధిక్యం లో ఉన్నాయి. యూపీ ఉప ఎన్నికలో బీజేపీ ఆధిక్యం… ఉత్తర్ ప్రదేశ్లోని మి ల్కాపూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి అక్కడ బీజేపీ అభ్యర్ధి చంద్రభాను ప్రసాద్ 3 వేల కుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.