Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భద్రతా వైఫల్యం కొట్టొ చ్చినట్లు కనబడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాం డ్ కంట్రోల్ సెంటర్ లోకి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ 3 సార్లు వచ్చి వెళ్ళి రూ.2.82 లక్షలు గుర్తు తెలియని వ్యక్తి కాజేశాడు. ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ లోకి 4 సార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఘట నలు మరువక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ 3 సార్లు వచ్చి వెళ్ళిన దుం డగుని వైనాన్ని చూసి ప్రతి ఒక్క రూ వివ్వెరపోతున్నారు.
నిందితు డు ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలో ఫర్ కేఫ్ లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్ఞానసాయి ప్ర సాద్ అనే వ్యక్తిని కలిసి తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించాడు.హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయ ని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు.
దుంగడుగు తన ముందు పలు మార్లు ఐసీసీసీ నుండి బయటకు రావడంతో, అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసా యి ప్రసాద్ నమ్మి మోసపోయాడు.
అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు.
రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వల యం నడుమ ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్య వస్థకు అవమానం అని విమర్శలు వెల్లువెత్తున్నాయి.