Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big breaking : బిగ్ బ్రేకింగ్, హస్తిన ముఖ్యమం త్రిగా రేఖా గుప్తా

Big breaking : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఊహ గానాల ఉత్కంఠతకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ను 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీ కి మరోసారి మహిళా సీఎం పగ్గా లు చేపట్టబోతున్నారు. రేఖా గుప్తా కు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అను భవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఆమె రెండు పర్యా యాలు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠం పురా నుంచి కౌన్సిలర్‌గా, తర్వాత మేయర్‌గా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష సమా వేశంలో ముఖ్యమంత్రి పదవికి రేఖ గుప్తా, డిప్యూటీ ముఖ్యమంత్రి పద వికి ప్రవేశ్ వర్మ పేరును ఖరారు చే శారు.రేఖా గుప్తాకు గతంలో ఎమ్మె ల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు. కానీ రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితా న్ని ప్రారంభించిన ఆమె పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరచితురాలు. స్థానికంగా పా ర్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషిచేశారు. సామాజిక సేవా కార్య క్రమాల్లో ముందుండేవారు. రేఖాగు ప్తా కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం ఆమెకు కలిసొచ్చింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురు కైన పాత్ర పోషించిన ఆమె ఆ త ర్వాత బీజేపీలో చేరారు.పితంపుర కౌన్సిలర్‌గా, షాలీమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యా రు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకు రాలు. ఢిల్లీ ప్రాంతంలో పార్టీ వాయి స్‌ను గట్టిగా వినిపించే నేతల్లో ఆ మె ఒకరు. షాలీమార్ బాగ్ శాసన సభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థి ఆప్‌కు చెందిన బందనాకుమారి చేతిలో ఓటమి చెందారు. 2025లో అదే నియోజక వర్గం నుంచి బందనాకుమారిని 29వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిం చారు. రేఖాగుప్తా బీజేపీలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉం టూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయడమే ఆమెను సీఎంగా బీజేపీ ఎంపిక చేయడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ప్రధాని మోదీ సమక్షంలో ప్ర మాణ స్వీకారం …ఢిల్లీలో ఉ త్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్య మంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎ మ్మెల్యేలు ఎన్నుకున్నారు. 48 మం ది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎ న్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరో సారి మహిళా సీఎం పగ్గాలు చేపట్ట బోతున్నారు. రేఖా గుప్తాకు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెం ట్‌గా ఆమె రెండుసార్లు ఎన్నిక య్యారు. ఇదిలా ఉంటే రేఖ 1974 లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యాలో అధికారి.రేఖ కుటుంబం 1976లో ఢిల్లీకి మారింది. అప్పటికి అతనికి రెండేళ్ల వయసు. దీని త రువాత, రేఖ ప్రాథమిక విద్య నుం డి ఉన్నత విద్య ఢిల్లీలో జరిగింది.

తన బాల్యంలోనే రాష్ట్రీయ స్వ యంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరా రు.ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదు వుతున్నప్పుడు, ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నిక ల్లో విజయం సాధించారు. 1995– 96లో, ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యా రు. రేఖ తన చదువును LLB వరకు పూర్తి చేసింది.తన చదువు పూర్తయిన తర్వాత, రేఖ గుప్తా 2003-04లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్‌లో చేరి కార్యదర్శి పదవిని చేపట్టారు. 2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.

 

రేపే ప్రమాణ స్వీకారోత్సవం…
కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గ మం త్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరుగుతుం ది. ఢిల్లీలో డిప్యూటీ సిఎం ఫార్ము లా కనిపించదు. ఢిల్లీలో ముఖ్య మంత్రితో పాటు 6 మంది మం త్రు లు ప్రమాణం చేస్తారు. ఈ వేడుక మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభ మవుతుంది. ఈ కార్యక్రమం రాం లీలా మైదానంలో నిర్వహిస్తారు. ఇందు కోసం ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమా న్ని ఘనంగా చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్య క్రమానికి అతిథుల జాబితా వచ్చే సింది. ఈ కార్యక్రమానికి బీజేపీ వివిధ రాష్ట్రాల్లోని తన ప్రభుత్వాల కు చెందిన మొత్తం 20 మంది ముఖ్యమంత్రులను ఆహ్వానించిం ది. వీరిలో ఉత్తరప్రదేశ్ నుండి నా గాలాండ్ వరకు ఉప ముఖ్యమం త్రులు కూడా ఉన్నారు.ఉత్తరప్రదేశ్ నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, మహారాష్ట్ర నుంచి ఏక్‌నాథ్ షిండే , అజిత్ పవార్, మధ్యప్రదేశ్ నుంచి రాజేంద్ర శుక్లా, జగదీష్ దే వరా, రాజస్థాన్ నుంచి దివ్య కు మారి, ప్రేమ్‌చంద్ బైర్వ, ఒడిశా నుంచి ప్రతిభా పరిదా, కనక్‌వర్ధన్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి అరుణ్ సా, విజయ్ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి చౌనా మెయిన్, ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్, బీహార్ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి, ప్రెస్టోన్ టిన్సోంగ్, నార్టియాంగ్ నుంచి ఎమ్మెల్యే సంగియావ్‌భాలాంగ్ ధార్, నాగాలాండ్ నుంచి టిఆర్ జెలియాంగ్, యంతుంగో పాటన్ రాంలీలా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటా రు.ఈ కార్యక్రమంలో మూడు రకా ల దశలు ఉంటాయి. ప్రధాన వేదిక పై ప్రధాని మోదీ, లెఫ్టినెంట్ గవర్న ర్ వీకే సక్సేనాతో పాటు ఢిల్లీ ము ఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు పాల్గొంటారు.