Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : ఇరాన్ అణుకేంద్రాలపై విరుచుకుపడిన అగ్రరాజ్యం

Big Breaking : ప్రజా దీవెన, ఇరాన్: ఇజ్రాయెల్ ఇ రాన్ యుద్ధంలో అగ్రరాజ్యం ప్రత్యక్ష పాత్ర పోషించింది. ఇరాన్ లోని మూడు ప్రధాన అణు కేంద్రాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్పహన్ లపై దా డి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వ్యక్తిగత సామాజిక మా ధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేశారు. అ మెరికా వాయు సేనలు బీ-2 స్పిరి ట్ బాంబర్లతో ఫోర్డోపై పూర్తిస్థాయి లో దాడి చేశాయని, ఇలాంటి ఆప రేషను ప్రపంచంలో ఏ దేశ సైన్యా ని కి సాధ్యమవదంటూ డోనాల్డ్ సద రు పోస్ట్ లో పేర్కొన్నారు. అగమాగ మవుతోన్న ఇరాన్ లో శాంతిని నెల కొల్పాల్సిన అవసరం ఉన్నందున ఆ బాధ్యత ఇరాన్ పైన మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఇరాన్ లో మరిన్ని లక్ష్యాలు మిగిలున్నాయని, టెహ్రాన్ శాంతి దిశగా ఆలోచించక పోతే దాడులను తీవ్రతరం చేస్తామ ని, వాషింగ్టన్, టెల్ అవీవ్ కలసి ప నిచేస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ఇరాన్ అణు కేం ద్రాలపై అమెరికా దాడుల తర్వాత యూఎస్ లోని ముఖ్యమైన నగరా ల్లో హై అలర్ట్ ప్రకటించారు. వాషింగ్ట న్, న్యూయార్క్, లాస్ ఏంజెలెస్ స హా ఇతర నగరాల్లో అధికారులు అ ప్రమత్తమయ్యారు. మరోవైపు ఈ దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమి న్ నెతన్యాహు స్పందించారు. ఇరా న్ లో అణు కేంద్రాలపై అమెరికా బీ 2 స్పిరిట్ బాంబర్లను ప్రయోగించ డంపై ట్రంప్ కు కృతజ్ఞతలు చెప్పా రు.

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడిపై ప్రపంచాధినేతలు స్పందిం చారు. గత 24 గంటల్లో జరిగిన ప రిణామాలను గమనిస్తున్నామని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి వి న్స్ టన్ పీటర్స్ అన్నారు. ఇజ్రాయె ల్ కోరినట్టు ఇరాన్అణు కేంద్రాలపై అమెరికా బాంబుల దాడిని బొలివే రియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా ఖం డించింది. మరో దేశం మెక్సికో విదే శాంగ మంత్రిత్వ శాఖ మధ్య ప్రా చ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను త గ్గించాలని, ఈ ప్రాంతంలో శాంతి చ ర్చలు జరగాలని, శాంతి కోసం దౌ త్య చర్చలకు పిలుపునిస్తున్నామని వెల్లడించింది.

*అమెరికన్ లే అసలు లక్ష్యం…*
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు దిగడంతో ఇందుకు ప్రతీ కారం తీర్చుకుంటామని, పశ్చిమా సియా ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యం గా చేసుకుంటామని ఇరాన్ అధి కారిక మీడియా ప్రకటించింది. మ ధ్యప్రాచ్యంలోని ప్రతి అమెరికన్ పౌ రుడు లేదంటే సైనిక సిబ్బందిని టె హ్రాన్ టార్గెట్ చేస్తుందని అమెరికాకు వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేకె త్తించింది. దీనికి సంబంధించిన వీ డియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.

అందులో ఇరాన్ ప్రభుత్వ టెలివిజ న్ యాంకర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ అణు కేం ద్రాలపై బాంబు దాడి చేసిన కార ణంగా వారు మొదలు పెట్టిన దాన్ని తాము అంతం చేస్తామని ఉంది. ఇ రాన్ గగనతలని షేధాన్ని ఉల్లం ఘించడం ద్వారా అమెరికా అతిపె ద్ద నేరం చేసిందని మీడియా పేర్కొ న్నది. దాడుల ద్వారా తమ జాతీ య అణు విధానాన్ని ఎవరూ అడ్డు కోలేరని ఇరాన్ వెల్లడించింది.దీంతో అమెరికాతో పాటు ప్రపంచానికి ఇ రాన్ తన అణ్వాయుధాల తయా రీపై స్పష్టత ఇచ్చింది.మరోవైపు ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను టా ర్గెట్ చేస్తామని యెమెన్ హౌతీలు ప్ర కటించారు.