Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big breaking: బిగ్ బ్రేకింగ్, పాఠశాలల్లో ఇక ప్రీ ప్రై మరీ,ప్రభుత్వం కీలక నిర్ణయం

Big breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని సర్కారు బడుల్లో ఇకపై ప్రీ ప్రైమరీ తరగతులకు ప్రభుత్వం గ్రీ న్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది నుం చే నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ క్లాసు లు ప్రారంభం కానున్నాయి. ఈ మే రకు తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం నుం చి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగ తులను ప్రవేశపెట్టేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయంతో ప్రైవేట్ పాఠశా లలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ-ప్రైమ రీ విద్య అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని 210 ప్రభుత్వ పాఠశా లల్లో ఈ తరగతులను ప్రారంభించ డానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చిం ది.

ఈ విద్యా సంవత్సరం నుంచే నర్స రీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులను చేర్చుకోవాలని డీఈవోలకు ఆదే శాలు జారీ చేసింది.ప్రైవేట్ పాఠ శాలలు నర్సరీ నుంచే విద్యను అం దిస్తున్నందున తల్లిదండ్రులు ప్రైవే ట్ స్కూళ్లను ఎంచుకుంటున్నారని, దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సీఎం గుర్తించారు. రిటైర్డ్ ఐఏఎస్ అ ధికారి అకునూరి మురళి నేతృత్వం లోని రాష్ట్ర విద్యా కమిషన్ ఈ స మస్యను పరిష్కరించేందుకు ప్రీ- ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టా లని సిఫార్సు చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వి ద్యార్థులను ఆకర్షించలేకపోతున్న సమస్యను అధిగమించడానికి, ప్రీ- ప్రైమరీ విద్యను అందించడం ద్వా రా విద్యార్థుల చేరికను పెంచాలని, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచి త రవాణా ద్వారా, ప్రీ-ప్రైమరీ తర గతులకు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.