Big Breaking: ప్రజా దీవెన, నారాయణపేట: మాటల తూటాలకు పెట్టిoది పేరు గా నిలిచే మహిళామనుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ మాటల యుద్ధం కాస్త చిలికి చిలికి గాలి వానలా మారి ప్రాణాల మీద కొచ్చింది. ఇద్దరు మహిళల మధ్య మాటా మాట పెరిగి ప్రాణాల మీది కొచ్చిన ఘటన నారాయణపేట జిల్లా నారాయణపేట మండల పరి ధిలో జరిగింది. మండల పరిధిలోని జిలాల్పూర్ గ్రామంలో ఇద్దరు మ హిళల మధ్య మంగళవారం ఉద యం మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది.గ్రామస్తుల కథనం మే రకు ఘటన వివరాలు ఇలా ఉన్నా యి.
గ్రామంలోని నర్సరీ వద్ద లక్ష్మి, బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మా టా మాట పెరిగింది. అది కాస్తా తీ వ్ర ఘర్షణకు దారి తీయడంతో ఒక రిపై ఒకరు పరస్పరం దాడి చేసు కున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్క డే మృతి చెందింది. లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా ఆమెను హు టాహుటిన 108 అంబులెన్స్లో జిల్లా ఆసు పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పో లీసులు విచారణ చేపడుతున్నా రు.