— బీజేపి నేతలు మనోహర్ రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి
BJP : ప్రజా దీవెన, చౌటుప్పల్: రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మునుగోడు నియోజకవర్గంలో బి జెపి గెలుపు ఖాయమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మ హేందర్ రెడ్డి, నల్లగొండ జిల్లా అ ధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిలు ధీ మా వ్యక్తం చేశారు. చౌటుప్పల మండల భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశo ఎల్లగిరి గ్రామం ఫంక్షన్ హాల్ లో మండల పార్టీ అధ్యక్షులు కైరం కొండ అశోక్ అధ్యక్షతన జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథులు గా డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలు మాట్లా డుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభు త్వం మోసాలను ప్రజలకు వివరిం చడానికి ఈ నెల 25 మార్చి నుండి గ్రామ గ్రామాల్లో బిజెపి కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరుగ్యారంటీలు ప్రజ లకు ఇవ్వకపోగా ఇంకా కుంటి సా కులు చెబుతూ పూట గడుపుతు న్న కాంగ్రెస్ పార్టీకి గురుంచి ప్రజ లకు తెలియజెప్పాలని సూచించా రు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చె ప్పడానికి ప్రజలు ఎదురుచూ స్తు న్నారని అన్నారు.
ఆరు గ్యారం టీల్లో ఆసరా పింఛన్లు రూ. 4వేల ఇస్తామని చెప్పి రూ. 2500 ఇస్తు న్న వైనాన్ని, మహాలక్ష్మి పథకం బాల బాలికలకు స్కూటీలు ఇస్తా మని, నిరుద్యోగులకు రూ. 4వేలు నిరుద్యోగ భృతి ,రైతు భరోసా ఇ లాంటివి ఎన్నో పథకాలను ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నా రని ద్వజమెత్తారు. ప్రభుత్వం ఏ ర్పాటు చేసుకున్న తర్వాత మాట మార్చి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కుంటి సాకులు చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి ప్ర తీ కార్యకర్త ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఇలాంటి వి షయాల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్ప డానికి బిజెపి కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా బిజెపి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించా రు. ఆందోల్ మైసమ్మ జలసాధన సమితికి ఈ సమావేశంలో రైతు లకు నీరు అందించే విషయంలో మైసమ్మ కత్వ నుండి ఏడు రోజు లు 2013 నాడే పాదయాత్ర చేయ డం జరిగిందని గుర్తు చేశారు.