Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : నకిలీ విత్తనాలను అరికట్టాలనీ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన బిజెపి కిసాన్ మోర్చా

District Collector Ila Tripathi :: ప్రజా దీవెన, నల్గొండ టౌన్:బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ,నకిలీ విత్తనాలను అరికట్టాలనీ కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో గోలి మధుసూదన్ రెడ్డి పాల్గొని..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు ,అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ విత్తనాలను అరికట్టడంలో విఫలమైందని గోలి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు పరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు, ఏకకాలంలో రుణమాఫీని పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదని, రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పిన పదిహేను వేల రూపాయలు ఏమయ్యాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు,అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం సన్నుడ్లకే 500 ఇస్తామని ఖరీఫ్ సీజన్ ముందు చెప్పిన ప్రభుత్వం నేడు సన్నవడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ వారి అకౌంట్లో జమ చేయలేక పోయిందని తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించారు.. ఈ కార్యక్రమంలో , కిసాన్ మోర్చా నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..