Blood Donation camp : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ చైర్ పర్సన్ డాక్టర్ కె ప్రేమ్ సాగర్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్స్ రెండు మూ డు మరియు నాలుగు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాత్మ గాంధీ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ హాజరయ్యారు. రక్తదాన ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రక్తాన్ని దానం చేయండి ప్రపంచ మానవుల ప్రాణా లను నిలబెట్టండి అని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులను మరి యు కార్యక్రమాన్ని నిర్వహించిన సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ మరియు ప్రోగ్రాం అధికారులు బి .వీరస్వామి, డా. జి సుధాకర్ లను ప్రత్యేకంగా అభినం దించారు. రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వా ల రవి, ఎన్ఎస్ఎస్ సమన్వయ కర్త డాక్టర్ మద్దిలేటి పసుపుల పా ల్గొని ఇప్పటివరకు రక్తదానం చేసిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు భవిష్య త్తులో ఎవరికి రక్తం అవసరమైన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమ రేందర్ రెడ్డి నల్గొండ ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారని తెలి పారు. ఈ కార్యక్రమంలో వివిధ వి భాగ అధిపతులు డా. రూప, డా. తిరుమల ,డా. సత్తిరెడ్డి, డా. ఆంజ నేయులు డా. మాధురి పాల్గొ న్నారు.