Breaking: తాజాగా ప్రముఖ వ్యాపారవేత రతన్ టాటా (Ratan Tata) అస్వస్థత గురై బ్రీచ్ కాండీ ఆసుపత్రికి (Breach Candy Hospital) తరలించినట్లు తెలుస్తోంది.. రతన్ టాటాకు రక్తపోటులో (blood pressure) గణనీయమైన తగ్గుదల తర్వాత క్రిటికల్ కండిషన్ ఉన్న సమయంలో రతన్ టాటా ను హాస్పిటల్ కు తీసుకొని వచ్చినట్లు హాస్పిటల్ అధికారులు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం రతన్ టాటాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో అందచేస్తున్నట్లు డాక్టర్స్ తెలిపారు. హాస్పిటల్లోనే ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో రతన్ టాటా పరిస్థితిని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం రతన్ టాటా ఉంచి నిరంతరం పరిశీలనలో ఉంచుతామని సాధ్యమైనంత వరకు ఉన్నతమైన వైద్య చికిత్సలు అందజేస్తామని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.. అయితే ప్రస్తుతం రతన్ టాటా ఎలా ఉన్నారు అన్న విషయం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.. .
ఇక రతన్ తాత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఒక భారతీయ పారిశ్రామికవేత, టాటా సన్స్ మాజీ చైర్మన్.. రతన్ టాటా చారిటబుల్ ట్రస్ట్ లకు నాయకత్వం వహించడంతోపాటు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ను కూడా సొంతం చేసుకున్నారు.. రతన్ టాటా (Ratan Tata) అనేక స్టార్టపులలో అనేక పెట్టుబడులు పెట్టి ఇప్పటి వరకు 30 స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది.