Bride Sucide: ప్రజా దీవెన, ప్రకాశం: అయ్యో ఏమైందో ఏమో గానీ నిండు ప్రా ణాలను పణంగా పెట్టాల్సి వ చ్చింది. ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరం గ్రామంలో తీవ్ర విషాదం సంఘటన చోటుచే సుకుంది. గ్రామానికి చెందిన నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. ఫిబ్రవరి 16వ తేదీ న కుటుంబ సభ్యులు సుస్మితకు పెద్దారవీడు మండలం సిద్ది నా యుడు పల్లి గ్రామానికి చెందిన వెం కటేష్ కు వివాహం చేశారు. ఫిబ్ర వరి 17వ తేదీన వధువు స్వగ్రా మమైన దేవనగరంలో తొలిరాత్రి కార్యం కూడా జరిపించారు.
మరు సటి రోజు అంటే 18వ తేదీ ఈరోజు ఉదయం వరకు అందరితో బాగానే మసలుకుంది. నవ వధువుకు బం ధువుల పరామర్శ కూడా జరిగింది. ఇక పుట్టింటి నుంచి బయలుదేరి అత్తారింటికి వెళ్ళాలి. అంతా బాగా నే ఉందనుకుంటున్న సమయంలో మధ్యాహ్నం సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఏం జరిగిం దో ఎవరికీ అర్ధం కావడం లేదు, ఇష్టంలేని పెళ్ళి చేశారా, లేక ఇంకే మైనా జరిగిందా అనేది ఇంకా తేల లేదు. అకస్మాత్తుగా సుస్మిత మంగ ళవారం మధ్యాహ్నం ఎవరు లేని సమయాన్ని చూసి ఇంట్లో ఉరి వే సుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటన పెళ్ళికి వచ్చిన దగ్గరి బంధువులను కన్నీరు పెట్టించింది. ఉరి వేసుకున్న నవవధువు సుస్మి తను కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ సమా చారాన్ని అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధు వు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తన్నారు. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందడంతో దేవ నగరం గ్రామంలో విషాదం నెల కొంది.