–రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసుల అదుపులోకి
–క్వారీ యజమానిని బెదిరించిన కే సులో ఎదురుచూసిన పోలీసులు
–సుబేదారి పీఎస్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తత
MLA kowsik reddy : ప్రజా దీవెన, హుజురాబాద్ : కరీం నగర్ జిల్లా హుజూరాబాద్ ఎ మ్మె ల్యే పాడి కౌశిక్ రెడ్డిని హనుమ కొం డ జిల్లా సుబేదారి పోలీసులు హైద రాబాద్ లో శంషాబాద్ విమా నాశ్ర యం వద్ద నిన్న రాత్రి అరెస్ట్ చే శా రు. క్వారీ యజమాని మనోజ్ అ నే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు గురిచేశాడని చే సిన ఫిర్యాదు మేరకు పోలీసులు వి చా రణ ప్రారంభించారు. అందులో భాగంగా విచారణలో ఎమ్మెల్యే బెది రింపులు వాస్తవమేనని ధ్రువీకరిం చారు. విషయం తెలుసుకున్న జిల్లా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు హను మకొండలోని సుబేదారి పీఎస్ కు భారీగా చేరుకుని, ఎమ్మెల్యేను వెం టనే కోర్టులో హాజరు పరచాలని డి మాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
కౌశిక్ రెడ్డి భార్య సతీమణి షాలిని సైతం పీఎస్ కు వచ్చారు. ఈ క్రమం లో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. అయితే ఎమ్మెల్యేకు వై ద్య పరీక్షలు నిర్వహించిన అనంత రం కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసును కొట్టి వేయాలని కౌశిక్ రెడ్డి గతంలో వేసి న పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసిం ది. అనంతరం వేసిన ముందస్తు బె యిల్ పిటిషన్ ను కోర్టు తోసిపు చ్చింది. తాజా పరిణామాలతో ఎ మ్మెల్యే తరఫు లీగల్ టీమ్ సమా లోచనలు చేస్తున్నట్టు సమాచారం.
*అవినీతిని అడిగితే అక్రమ కేసులా..* ప్రభుత్వ అవినీతి అ క్రమాలను ప్రశ్నిస్తే తనపై అక్రమ కే సులు పెడుతున్నా రని ఎమ్మల్యే కౌ శిక్ రెడ్డి ఆరోపిం చారు. కేసులు పె డితే భయపడేవారు ఇక్కడ ఎవ రూ లేరని పేర్కొన్నారు. ఇంకా పె ద్ద ఎత్తున రేవంత్ సర్కారుపై ఉద్య మం చేపడతామని స్పష్టం చేశారు. మరోవైపు హుజూరాబాద్ సహా పలుచోట్ల నుంచి తరలివస్తున్న బీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చే స్తున్నారు.