Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Party : రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ

BRS Party : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : బిఆర్ఎస్ పార్టీ వరంగల్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ.. నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ పట్టణ కమిటీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మొదట పానగల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద జెండా ఊపి కంచర్ల భూపాల్ రెడ్డి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, పహల్గామ్ ఉగ్ర దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.ర్యాలీ రామగిరి, ప్రకాశం బజారు, దేవరకొండ రోడ్ పాత బస్తి మీదుగా గడియారం సెంటర్ వరకు సాగింది.

నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ లు అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి , సయ్యద్ జాఫర్, జమాల్ ఖాద్రి, మెరుగు గోపి, దండంపల్లి సత్తన్న, సూర మహేష్, రంజిత్ వింజమూరు లక్ష్మణ్, పెరికే యాదయ్య, కంకణాల వెంకటరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.