Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Party : చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహసభ

–ఊరు వాడా ఉప్పెనలా కదులుదాం
–రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ: మల్లయ్య యాదవ్

BRS Party : ప్రజా దీవేన, కోదాడ: రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నా నాయకుడు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ లు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని గడపగడపకు వెళ్లి బొట్టుపెట్టి బిఆర్ఎస్ సభకు హాజరుకావాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… రేవంత్ సర్కార్ లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నమన్నారు.అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడంలో ముందు వరుసలో ఉంటుందని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించి, ఆ లక్ష్యాన్ని సాకారం చేసి, నిన్న అధికార పార్టీగా రాష్ర్టాన్ని పదేండ్ల పాటు సుభిక్షంగా, సుఖ, సంతోషాలకు ఆలవాలంగా నిలబెట్టి, నేడు ప్రతిపక్ష పార్టీగా 16 నెలలుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ దుర్మార్గాన్ని అడుగడుగునా చీల్చి చెండాడుతూ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ఆశగా, శ్వాసగా కేసీఆర్‌ నాయకత్వాన రజతోత్సవం జరుపుకొంటున్న వేళ చరిత్రాత్మకమైన భారీ బహిరంగసభకు భారీగా తరలిరావాలని అన్నారు.


చరిత్రలో అనేక సందర్భాల్లో తెలంగాణకు ద్రోహం తలపెట్టిన, ఇప్పటికీ తలపెడుతూనే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ద్రోహాన్ని ప్రజా సమూహంగా నిలదీద్దాం వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పైడిమర్రి సత్యబాబు, ఏలూరి వెంకటేశ్వరరావు, అరె లింగారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు నయుం, మాజీ వార్డ్ కౌన్సిలర్ మేదర లలిత నాయకులు అల్వాల వెంకట్, , చింతల నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, పట్టణ నాయకులు కర్ల సుందర్ బాబు, సుంకర అభి నాయుడు, సంగిశెట్టి గోపాల్, ఉపేందర్ గౌడ్, తాజ్, ఉపేందర్ యాదవ్, తుపాకుల భాస్కర్, బొజ్జ గోపి, కాసాని మల్లయ్య గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.