Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSHarishRao : హరీశ్ కీలక వ్యాఖ్య, ఆధారాలతో సహా సమాధానాలను కమిషన్ కు అందించాను

 

BRSHarishRao: ప్రజా దీవెన, హైదరాబాద్: సోమవారం కాళే శ్వరం కమిషన్ విచార ణలో భాగంగా హాజరయ్యాను, కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు స మాధానం చెప్పడం జరిగింది. ఆధా రాలతో సమాధానాలను కమి షన్ కు అందించడం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యా ఖ్యానించారు. బిఆర్ కే భవన్ మీడియా పా యింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..కమిష న్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడ టం సరికాదు. రాజకీయాలు ఏమైనా ఉంటే రేపు మాట్లాడు కుం దాం. లోపట ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం తప్పు అవుతుం ది.

మొట్టమొదలు తమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ ను ఎం దుకు మార్చారు అనేదానిపై చాలాసేపు డిస్కషన్ జరిగింది.దానికి నేను కొ త్తగా ఏర్పడిన తెలంగాణప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడా నికి అన్ని రకాల ప్రయత్నం చేసా ము. ఇరిగేషన్ మంత్రిగా రివ్యూ చే సినప్పుడు ప్రాణాహిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలుగా టెండర్ల ను పిలిచింది గత కాంగ్రెస్ ప్రభు త్వం. తల పనులు స్టార్ట్ చేయ కుండా తోక పనులను కాంగ్రెస్ ప్ర భుత్వం తవ్వింది. మహారాష్ట్ర కాం గ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్ర ఫ్ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై న నెలకే వెళ్లి కలవడం జరిగింది.

తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మా ణా నికి అనుమతి ఇవ్వండని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ గారిని కోరడం జరిగింది.ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హాసన్ ముష్రఫ్ చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభు త్వంపై నిరసన కా ర్యక్రమాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రా జెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణా నికి ఒప్పుకోమని తేల్చిచెప్పారు.

ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి చౌహాన్ అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి ఒప్పుకోమ ని తేల్చి చెప్పారని చెప్పడం జరిగిం ది. ఈ విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళాము. మహారా ష్ట్ర, తెలంగాణ మధ్య తమ్మిడిహట్టి వద్ద ప్రా జెక్టు నిర్మాణానికి ఐదారు మీటింగ్లులు జరిగాయి.

మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నీటిపారుదల మంత్రిని కలిసి మళ్లీ తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు ని ర్మాణా నికి సహకరించాలని, తెలంగాణకు నీటి అవసరం ఉందని కోరడం జరిగింది.స్వయంగా కేసీఆర్ మహారాష్ట్ర వ చ్చి అప్పటి గవర్నర్ విద్యాసాగర్ సమక్షంలో బిజెపి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ని కలిశారు. అనేక విధా లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నికెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

ఏడేండ్లు మాకంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి పార్టీ తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చే సింది తానేనని ఇప్పుడు ఆ ప్రాజె క్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇ వ్వలేమని పడ్నవీస్ తేల్చి చెప్పా రు. కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్ర లో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఏడు సంవత్సరాలు అధికారం లో ఉంటే ఒక్క అనుమతి కూడా సా ధించలేదు. ఒక్క అంతర్రాష్ట్ర ఒ ప్పందం చేసుకోలేదు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదు.

తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మా ణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమ టిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి పట్టించుకో లేదు. సెంట్రల్ వాటర్ కమిష న్ తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదు అని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యా మ్నాయం చూసుకోవాలని లేఖ రాసింది.

అదేవిధంగా CWC తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వా యర్ల సామర్థ్యం కూడా సరిపోదని సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయ ర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసిం ది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ని బ్యారేజ్ నిర్మా ణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ కోరడం జరిగింది.

కేంద్ర సంస్థ వాప్కోస్ లాడార్ సర్వే చేసి, ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంది అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపింది.వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్లుగా పొ రుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిం చ లేదు. అదేవిధంగా మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న చోట చా ప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. వైల్డ్ లైఫ్ అ నుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి వస్తుంది.

నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రతి పాదిస్తే నీళ్లు ఉన్నచోట ప్రా జె క్టును బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. అన్ని రకాల ఆధారా లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఉత్త రాలు, జీవోలు అన్నీ కమిషన్ కు సమర్పించడం జరి గింది.

కాళేశ్వరం కార్పొరేషన్ కి అనుమతి ఉందా అని అడిగారు. కాళే శ్వరం కమిషన్ కు స్పష్టంగా అనుమతి ఉన్న విషయాన్ని అన్ని ఆ ధారాల తో సమర్పించడం జరిగింది. అన్నా రం, సుందిళ్ల బ్యారేజీ లోకేషన్ మా ర్పుల గురించి అడిగారు.అది పూర్తి గా టెక్నికల్ నిర్ణ యం. ఇంజనీర్ల డీ టెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మా రింది. ఇంజనీరింగ్ డి పార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయమని చె ప్పాను.

దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల ని ర్మాణ విషయంలో జరుగుతుంది వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్ కి సమర్పించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో రిజర్వా యర్లకు కెపాసిటీ ఎంత అని అడి గా రు. 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించామ ని చెప్ప డం జరిగింది. కాళేశ్వరంపై పిచ్చి కూతలు కూస్తూ కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. అన్ని ఇంటెక్ట్ ఉన్నాయి.

కాలేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు21 పంప్ హౌజులు, 203 కిలోమీ టర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రె జర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టో రేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టి ఎంసీల నీటి విని యో గం…పూర్తిగా ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి.

ముఖ్యమంత్రి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజె క్టుకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోతా యి. మల్లన్న సాగర్ కాళే శ్వరం ప్రాజెక్టులో భాగం.హైదరాబాద్ మూసీ సుందరీకరణకు మల్ల న్న సాగర్ నుంచి నీళ్లు తరలిస్తామంటున్నా రు. ఆమల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అదేవిధంగా హైదరాబాద్ కు తాగునీ టిని మల్లన్న సాగర్ నుంచి ఇస్తామంటున్నారు అది కాళేశ్వరంలో భాగంకాదా.

మల్లన్న సాగర్ పై ఆధారపడ్డ గంధ మల్లకు టెండర్లు పిలిచి శంకు స్థాపన చేస్తారు. మరో పక్క కాళేశ్వరం కూలింది అని దుష్ప్రచారం చేస్తా రు. కాళేశ్వరం ఎప్పటికైనా తెలం గాణకు జీవధార. ఈ విష యం తె లంగాణ ప్రజలకు అర్థమైంది.కాళేశ్వరం కమిషన్ ముందు ఏదీ నోటి మాటగా చెప్పలేదు. అన్నీ సాక్ష్యాధారాలతో సహా సమ ర్పిం చడం జరిగింది.క్యాబినెట్ నిర్ణయా లు, వాప్కోస్ రిపోర్టులు, సీడబ్ల్యూ సీ లేఖలు అన్నీ సమర్పించడం జరి గిందని వివరించారు.