Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSmla padiKaushikReddy : బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట, బెయిల్ మంజూరు

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట, బెయిల్ మంజూరు

BRSmla padiKaushikReddy:  ప్రజాదీవెన, హుజురాబా ద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయ మూర్తి తీర్పునివ్వడంతో బిఆర్ఎ స్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మంగళవారం కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు సంక్రాంతి సెలవుదినం కావడంతో న్యాయ మూ ర్తి ఇంటి వద్ద కౌశిక్ రెడ్డిని హాజరు పరిచారు.

బారాసా లీగల్ టీం వాద నలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయి ల్ మంజూరు చేశారు. నిన్న రాత్రి హైదరాబాదులో కౌశిక్ రెడ్డి ని అరె స్ట్ చేసిన పోలీ సులు కరీంనగర్ కు తరలించి మంగళవారం ఉద యం వరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ప్రభుత్వ ఆసుప త్రి వైద్యులను పిలిపించి పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలను సైతం చేయించారు. కౌశిక్ రెడ్డి ని రెండు కేసుల్లో అరెస్టు చేసినట్లు పోలీసు లు న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు.

కరీంనగర్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ తనను సమా వే శంలోకి వెళ్లకుండా అడ్డుకున్నా రని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమో దైన కేసు తో పాటు, జగిత్యాల ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు కరీంనగర్ ఆర్డిఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు న మోదు చేసిన కేసు ఒకే దాంట్లో క్లబ్ చేసి అరెస్టు చేసినట్లు పేర్కొ న్నా రు. అయితే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైన సందర్భంగా ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా న్యాయస్థానాలపై తమకు గౌరవంఉందని తమ వైపే న్యాయం ఉంద ని బిఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.

 

కేసులెన్ని పెట్టినా అదిరేది, బెదిరేది లేదు :  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి ఎన్ని అక్రమ కేసు లు పెట్టినా బెదిరేది లేదని, ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నిస్తూనే ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం పోలీసులు మెజిస్ట్రే ట్ ముందు హాజరు పరచడానికి తీసుకెళ్లే సమయంలో మాట్లాడు తూ ఎన్ని అక్రమ కేసులు పెట్టి జై ల్లో వేసిన తాను భయపడేది లేదని
స్పష్టం చేశారు.

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని అడిగితే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజల పక్షాన ఉం డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయా లని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. హామీలను అమ లు చేయడం మర్చిపోయి ప్రభుత్వం బారాసా నేతలను అక్రమంగా అరెస్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.