Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BSP State Secretary Boddu Kiran : అత్యాచార భాధితురాలు కు న్యాయం చేయాలి

BSP State Secretary Boddu Kiran : ప్రజా దీవెన శాలిగౌరారం ఏప్రిల్ 2 : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని ఊర్కొండ లో వివాహిత పై జరిగిన దారుణమైన అత్యాచారాన్ని బి ఎస్ పి తీవ్రంగా ఖండిస్తోందని బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్ అన్నారు.బుధవారం అయన శాలిగౌరారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందుతులందరికీ కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

 

ఈ విషయం లో అధికారులు మరింత వేగవంతమైన సమగ్ర దర్యాప్తు చేయట్టాలన్నారు.భాదిత మహిళకు తగిన న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమం లో వేముల లక్ష్మణ్, రజిత, బొడ్డు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.