— మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
Burri Srinivas Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు అన్నారు. నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ లో పృథ్వీరాజ్ నూతనంగా ఏర్పా టు చేసిన గిఫ్ట్ ట్రీని సోమవారం న ల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు.
స్వ యం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటే తాను ఉపాధి పొందడంతో పాటు మరి కొంతమం దికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నల్గొండ పట్టణంలో సెట్విన్ తో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు.
నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్లగొండ, కనగల్ మాజీ జడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు గడిగ హిమబిందు శ్రీనివాస్, ఆలకుంట్ల మోహన్ బాబు, మారగోని గణేష్, వజ్జ రమేష్, కత్తుల కోటి, మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూపా అశోక్ సుందర్, ఎగ్గడి సుజాత, సూరెడ్డి సరస్వతి, 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, 48 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాదం అనిల్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిద్దు, కంచర్ల ఆనంద్ రెడ్డి, శ్యామ్, రాజశేఖర్ , చింతపల్లి గోపాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.