Busi Reddy Pandhu Ranga Reddy: ప్రజా దీవెన గుర్రoపోడు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజ కవర్గం గుర్రంపోడు మండలం తేనె పల్లి, ముల్కలపల్లి పంచాయతీ పరిధిలో నిర్వహించిన జిల్లా స్థాయి లో క్రికెట్ పోటీల్లో విజేతలకు బుసి రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి బహుమతులు అందజేశారు. శనివారం నిర్వ హిం చిన బహుమతి ప్రధానోత్సవం లో ఆయన పాల్గొని పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న పోచం పల్లి యూత్ కు మొదటి బహు మతిగా రూ. 25 వేలు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి చేతుల మీదుగా అంద
జేశారు.
ద్వితీయ బహుమతి గెలుచుకున్న ముల్కలపల్లి యూత్ కి ఎర్రమాడ గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా మరి యు తృతీయ బహుమతి గెలుచు కున్న తేనెపల్లి యూత్ కి గట్టుపల్లి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా బ హుమతుల ప్రధానోత్సవ కార్యక్ర మం చేపట్టారు. అదేవిధంగా క్రికెట్ ఆటగాళ్ళకు పాపిరెడ్డి టీషర్ట్స్ పం పిణీ చేయడం జరిగింది.గత 12 రో జుల క్రిందట ప్రారంభించిన క్రికెట్ టో ర్నమెంట్ లో ప్రధమ బహుమ తి గెలుచుకున్న వారికి ఇస్తానని ప్రకటించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అందులో భాగంగా పోచంపల్లి యూత్ కి నగదు రూపంలో మరి యు మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా బుసిరెడ్డి ఫౌండేష న్ చైర్మన్ బుసిరెడ్డి పాండురoగా రె డ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరకం గా, మానసికంగా నూతనోత్సాహా న్ని కలుగజేస్తాయని అన్నారు. గె లుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ మంచి దృక్పథంతో,మంచి ఆలోచన సరళి తో ముందుకు వె ళ్ళాలని, మున్ముందు గ్రామాల్లో వున్న యువత ప్రతి సామాజిక సే వా కార్యక్రమాలలో పాల్గొనాలని కో రారు.నా వంతు అవసరమైన మేర కు గ్రామాల అభివృద్ధికి సహాయప డతానని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి య డవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, పో చంపల్లి మాజీ యంపిటిసి సత్య నారాయణ,గుండెబోయిన సత్య నారాయణ,బొంగరాల నరేష్,పూల సైదులు బి.సి రాజ్యాధికార నల్గొం డ జిల్లా అధ్యక్షులు కర్నాటి యాద గిరి, షేక్ ముస్తాఫ, స్థానిక నాయకు లు వడిత్య నాగరాజు,ఎర్రమాడ ఉపేందర్ రెడ్డి, ఎర్రమాడ గోవర్ధన్ రెడ్డి,గట్టు పల్లి రవీందర్ రెడ్డి,ఆర్. పాపిరెడ్డి,బొడ్డుపల్లి లింగస్వా మి, పగిళ్ళ భాస్కర్,మండలి లింగ య్య,మర్రిపెద్ది పృధ్వీరాజ్ రెడ్డి, మారుపాక వెంకటయ్య స్వామి, బుసిరెడ్డి మట్టా రెడ్డి, గజ్జల శివా రెడ్డి, అనుముల కోటేష్, గజ్జల నాగార్జున రెడ్డి, పాశం శ్రీనివాస రెడ్డి, ఇస్రం లింగస్వామి, పోలోజు రమేష్ చారి,గజ్జల వినోద్ రెడ్డి, అబ్దుల్ కరీం మరియు తేనె పల్లి, ముల్కలపల్లి మరియు పోచంపల్లి గ్రామస్తులు,యువత తదితరులు పాల్గొన్నారు.