— గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలి
–పాలమూరు, రంగారెడ్డి, సీతారా మ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి
–తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేయండి
–జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
C M Revanth Reddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధ మైన వాటా కేటాయించాలని జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమా రు 70 శాతం తెలంగాణలో ఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శా తం వాటా తెలంగాణ రాష్ట్రానికి కే టాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. గోదావరికి సంబం ధించి తెలంగాణ వాటా నికర జలా లు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టుల పై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి పాటిల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్కు మా ర్ రెడ్డి సోమవారం సాయంత్రం భే టీ అయ్యారు. కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలం గాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనం తరం విలేకరుల సమావేశంలోనూ ఆయా వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమా ర్రెడ్డి తెలియజేశారు. కృష్ణా పరి వాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్కు 66, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివ రించారు.
ఏళ్లుగా తాము నష్ట పోతున్నామని, ఈ ఏడాది సైతం ఆంధ్రప్రదేశ్ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించు కుపోయిందన్నారు. ఇక ముందు తమ వాటాకు మించి కృష్ణా నది నీటిని ఏపీ తరలించుకొని పోకుం డా చూడాలన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడు దలకు సంబంధించి వెంటనే టెలీ మెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయా లని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కానికి 2022లోనే డీపీఆర్ సమ ర్పించినా అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదే సమ యంలో న్యాయస్థానాల పరిధిలోని అప్పర్ భద్రకు మాత్రం అనుమతు లు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తి పోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీల కు మాత్రం అనుమతులు ఇవ్వలేద న్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలి యజేశారు. ఈ పథకానికి సం బంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమా న్య బోర్డు (జీఆర్ఎంబీ), కేఆర్ఎం బీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదన్నారు.
గోదావరిపై తా ము చేపట్టిన సీతారామ ఎత్తిపోత ల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సం బంధించి ఇప్పటి వరకు అనుమ తులు ఇవ్వలేదన్నారు. గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని, గోదావరిపై తెలంగాణ చేపడుతు న్న ప్రాజెక్టులకు వెంటనే అనుమ తులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అలా చేయకపోతే ఆయకట్టు స్థిరీకరణ పేరుతో తా ము నష్టపోతామని, కృష్ణా డెల్టా ఆయకట్టును చూపి కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేశారని ఆయ న గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌనిల్స్లోనూ ఏపీ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఎటు వంటి చర్చ జరగలేదని కేంద్ర మం త్రికి సీఎం వివరించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీ పడబోమని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాల మూరు- రంగారెడ్డి, సీతారామ ఎత్తి పోతల, మోడి కుంట వాగు, చనా ఖా కొరటా బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), చిన్న కాళేశ్వరం (ముక్తే శ్వర) ఎత్తిపోతల పథకాలకు సత్వ ర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ).. పీఎంఆర్పీ 2024 కింద తగిన ఆర్థిక సహాయం అంద జేయాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సాగు నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అంద జేసేందుకు మౌలిక వసతుల అభి వృద్ధి కింద 50 సంవత్సరాలు పా టు వడ్డీలేని రుణాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్య మంత్రి అభ్యర్థించారు. ప్రాణహి త-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మా ణం చేపడతామని, ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. సమా వేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యద ర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్య దర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజయ్ భాస్కర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమి షనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.