— ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ ఫ్యూచర్ సిటీ
— రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మూడు బిల్లులు
–టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట కూ ట్రస్టు బోర్డుకు ఆమోదం
–తెలంగాణకు పర్యాటక పాలసీ ఐ దేళ్లకు పచ్చజెండా
— తెలంగాణ మంత్రివర్గ సమావే శంలో కీలక నిర్ణయాలు
Cabinet Green Signal : ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణ తో పాటు బీసీ రిజర్వేషన్లపై చట్టాలను రూపొందిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సర్వేలు, కమిషన్ల నివేదిక లు, మేధావులు, కుల సంఘాల అభిప్రాయాల ఆధారంగా విస్తృత కసరత్తు చేసి, చట్టాల రూ పకల్ప నకు మార్గాన్ని సుగమం చేయడా నికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర కు మూడు ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమో దం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ము సాయిదా బిల్లుతోపాటు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం; విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి రెండు ము సాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది.
వీటిని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదిం చాలని నిర్ణయించింది. లోక్సభ ని యోజకవర్గాల పునర్విభజన విష యంలో దక్షిణాది రాష్ట్రాలు ము ఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రానికి తమ వాణిని వినిపించాలని తీర్మానించింది. ఇం దుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశా న్ని నిర్వహించనుంది. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువా రం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంజరిగింది. మధ్యా హ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకూ ఆరు గంటలపాటు సుదీర్ఘంగా కొన సాగింది. అనంతరం రెవెన్యూ మం త్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ క్యాబినెట్ నిర్ణయాల ను విలేకరులకు వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణపై ముసాయిదా బిల్లు కు ఓకే…. ఎస్సీ వర్గీకరణ కు దశాబ్దాలుగా పోరాటాలు జరి గాయి. సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే దానిని తమ ఇం దిరమ్మ ప్రభుత్వం తప్పకుండా అ మలు చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. చెప్పిన మాట ప్రకారం జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ వేశారు. ఆయ న ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించింది. కమిషన్ సిఫారసులను పునఃపరిశీ లన చేయాలంటూ వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని పరిశీలించాలంటూ మళ్లీ షమీమ్ అక్తర్ కమిషన్కు ఇవ్వడం జరిగింది.
భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుం డా ఉండడానికి, మొక్కుబడిగా చే శారన్న ఇబ్బంది రాకుండా ఉండడా నికి మళ్లీ కమిషన్కు అప్పగించా మని , వీటిని పరిశీలించిన కమిషన్ ప్రభుత్వానికి మరోసారి నివేదిక ఇవ్వగా దాని ఆధారంగా ముసా యిదా బిల్లును రూపొందించామని అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగు లేటి వివరించారు. దీనిని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి, చట్ట రూపంలో తీసుకురావాలని క్యాబినెట్లో నిర్ణయించడం జరి గిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పై కుల గణన సర్వే, బలహీన వర్గా ల సంఘాలు, మేధావుల సలహాల పై క్యాబినెట్లో చర్చించామని, ఈ వివరాలతో రాబోయే శాసన సభ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్ట నున్నామని వెల్లడించారు. గత శా సన సభలో (2017) 37 శాతంతో పెట్టినబిల్లును వాపసు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ.. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ ఫ్యూచర్ సిటీ గా ప్రకటించడం జరిగిందని, ఈ ప్రాంతంలోని ఏడు మండలాలు, 56 గ్రామాలను కలిపి ‘ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)గా ఏర్పాటు చేస్తూ క్యా బినెట్ నిర్ణయించిందని మంత్రి పొం గులేటి తెలిపారు. నాగార్జున సా గర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మ ధ్యలో ఉన్న దాదాపు 30 వేల ఎక రాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చే యాలని నిర్ణయించామన్నారు. ఈ 56 గ్రామాలతోపాటు ఇదివరకు హె చ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రా మాలను ఎఫ్సీడీఏకు బదిలీ చేయ డం జరిగింది. దీనికి 90 పోస్టులను మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమో దించింది. హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగు రోడ్డు దాటి 2 కిలో మీటర్ల బఫర్ జోన్ వరకు విస్తరిం చడం జరిగిందని, అంటే 11 జిల్లా లు, 104 మండలాలు, 1,355 గ్రా మ పంచాయతీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉంటాయని, మరో 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి రాబోతున్నాయని వివ రించారు.
కోటి మంది మహిళలను కోటీ శ్వరులను… కోటి మంది మహిళ లను కోటీశ్వరులను చేయాలన్న చి త్తశుద్ధితో ఇందిరా మహిళా శక్తి మి షన్ కింద ‘ఇందిరా మహిళా శక్తి పాలసీ–2025’ని క్యాబినెట్ ఆమో దించిందని మంత్రి పొంగులేటి తెలి పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు ఎలాంటి భద్రత, సహాయాన్ని అందించారో అదే మా దిరిగా ఇప్పుడు వారి అభివృద్ధి కో సం పాలసీని తెస్తున్నామన్నారు. ‘‘గతంలో గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలను సెర్ప్ కింద, పట్టణ ప్రాంత మహిళా సంఘాలను మె ప్మా కింద పెట్టారు. ఇకపై రాష్ట్రంలో ఈ మహిళా సంఘాలన్నీ ఒకే గొడుగు కింద ఉండాలని నిర్ణయిం చడం జరిగిందన్నారు. ఇందిరా మ హిళా శక్తి గ్రూపుల్లో గతంలో 60 ఏళ్లకే సభ్యులకు రిటైర్మెంట్ ఉండే దని, దీనిని 65 సంవత్సరాలకు పొడిగించామన్నారు. గతంలో 18 ఏళ్లు నిండినవారికే సభ్యులుగా చేరే అవకాశం ఉండేదని, ఇప్పుడు దీనిని 15 ఏళ్లకు కుదించమని, 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వారు మహిళా శక్తి గ్రూపుల్లో సభ్యు లుగా ఉండొచ్చని వివరించారు.
క్యాబినెట్లో పలు నిర్ణయాలు ఇలా…. తిరుమల తిరుపతి దేవ స్థానం ట్రస్టు బోర్డు మాదిరిగానే యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయానికి ట్రస్టు బోర్డును ఏర్పా టు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్స్టిట్యూ షన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్– 1987ను సవరించాలని నిర్ణయిం చామన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, రాష్ట్రంలో అనేక టూరిస్టు స్పాట్లు ఉన్నా, ఒక పాలసీ లేకపోవడం వల్ల నష్టం జరిగిందని, తెలంగాణకు కూడా ఒక టూరిజం పాలసీ ఉండాలని సమావేశంలో నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు ‘తెలంగాణ టూరిజం పాలసీ– 2025–30’ను ఆమోదించడం జరి గిందని, రాష్ట్రంలోని 27 టూరిజం స్పాట్లను ప్రత్యేక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, రాబోయే ఐదేళ్లలో దీనివల్ల రూ.15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నా రు.
అదేవిధంగా మేలో జరిగే ‘మిస్ వరల్డ్’ పోటీలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయిం చాం. దీనికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశా ల నుంచి వచ్చే అతిథులకు లోటు జరగకుండా చూడాలని నిర్ణయించ డం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖ కు సంబంధించి 10,954 రెవెన్యూ గ్రామాలకు నాథుడు లేరని, గడిచి న పదేళ్లలో ప్రజలు ఇబ్బందిపడ్డా ర ని, సీఎం, మంత్రులు చెప్పిన మా ట ప్రకారం వీటికి గ్రామపాలన అధి కారులను నియమించాలని నిర్ణ యించడం జరిగిందన్నారు. గతం లో రద్దు చేసిన వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థ లోని అర్హులైన వారిని ఈ పోస్టుల్లో నియమించాలని నిర్ణ యించడం జరిగిందని చెప్పారు.
ఇక శంషాబాద్ మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణా నికి 5.15 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు.పారాలింపిక్స్–2024 కాంస్య పతక విజేత దీప్తి జీ వాంజికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణ యం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ డివిజ న్లు, మండలాలను గత ప్రభుత్వం లో మొక్కుబడిగా ఏర్పాటు చేశా రని, వాటికి పోస్టులను కేటాయిం చలేదని, అందుకే, వాటికి 361 పో స్టులను మంజూరు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. తెలంగాణ రెసిడెన్షి యల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూ షన్స్ సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలకు 330 రెగ్యులర్, 165 ఔట్సోర్సింగ్, మొత్తం 495 పోస్టుల కు ఆమోదం తెలిపామన్నారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్వి భజనకు సంబంధించి కేంద్ర ప్రభు త్వం దురాలోచనతో లోక్సభ ని యోజక వర్గాలను పునర్విభజన చేయాలని అనుకుంటోందని, ఉత్త రం, దక్షిణం అనే భావనతో దక్షిణా దికి నష్టం చేయాలని యోచిస్తోన్నo దున కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై చ ర్చించాలని, పునర్విభజనను ప క్కాగా చేపట్టాలన్న డిమాండ్తో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిం చాలని నిర్ణయించామని, ఉత్తరా దికి లాభం చేకూరకుండా, దక్షిణా దికి నష్టం జరగకుండా చూడాల న్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వ ర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఉత్త రాదికి పెంచే దామాషా పద్ధతిలోనే దక్షిణాదికి కూడా సీట్లు పెంచాలం టూ డిమాండ్ చేయాలని నిర్ణయిం చడం జరిగిందని తెలిపారు.