Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cabinet meeting: ఏపిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అమలులోకి భూకబ్జా నిరోధకచట్టం

–తాజాగా తెరమీదకు ల్యాండ్ గ్రా బింగ్ ప్రివెన్షన్ చట్టం
–కొత్త ఇసుక పాలసీకి, పంటల బీమా పై చర్చ త్రిసభ్య కమిటీ
–రుణసేకరణకు పౌరసరఫరాల శాఖకు అనుమతి
–రూ.2000 కోట్లకు సర్కారు గ్యా రెంటీ తో రూ.3200 కోట్ల రుణంతో ధాన్యం కొనుగోళ్ళు
–ఏపీ మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదం

Cabinet meeting:ప్రజా దీవెన, విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ (Land titling)యాక్టు రద్దు బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ల్యాండ్ టైట్లింగ్ (Land titling)యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమో దం తెలిపింది. వెలగపూడి సచివా లయంలో మంగళవారం సీఎం చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు దీంతో కొత్త ఇసుక పాలసీపై ప్రభుత్వం త్వరలో విధి విధానాలను రూపొందించ నుంది. ఇంకా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేం దుకు ప్రభుత్వ గ్యారెంటీ (Government guarantee)ఇచ్చేం దుకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుం చి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవ సాయ సహకార కార్పోరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమో దం తెలిపింది.పంటల బీమా పై త్రిసభ్య కమిటీ పంటల బీమా పథ కానికి ప్రీమియం చెల్లింపుపై మంత్రి మండలి చర్చించింది.

ఇందుకు సం బంధించిన విధివిధానాల ఖరారుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముగ్గురు మం త్రులతో ఈ కమిటీని నియమించా లని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు (Agriculture Minister Acham Naidu), రెవె న్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెం డ్ల మనోహర్‌ (Nadendla Manohar) ఈ కమిటీలో సభ్యు లుగా నియమించారు.వీరు రెండు రోజుల పాటు అధికారులతో మా ట్లాడి విధివిధాలను నిర్ణయించను న్నారు. ప్రీమియంను రైతులు స్వ చ్ఛందంగా చెల్లించాలా, లేక ప్రభు త్వం చెల్లించాలా అనే అంశాన్ని ఖరారు చేయనున్నారు.

ఇందుకు సంబంధించి కేవలం రెండు రోజుల్లో నే నివేదికను వీరు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.ఓటాన్ అకౌం ట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ సహా వేర్వేరు అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు సహా వివిధ అంశాలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ పె ట్టిన ఒటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై నెలాఖరుతో ముగుస్తోంది. ఆగస్టు1 తేదీ నుంచి రెండు నెలల కాలానికి ఈ బడ్జెట్ పొడిగింపు ఆర్డి నెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపిం ది. మరోవైపు గత ప్రభుత్వ అక్రమా లపై విచారణలకు సంబంధించి కూ డా కేబినేట్ చర్చించినట్టు సమాచా రం.మరో వైపు రాష్ట్రంలో నూతన ఇసుక విధానరూపకల్పనపై కూడా కేబినేట్ చర్చించింది. మరో 15 రోజు ల్లోగా కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావి స్తోంది. మరోవైపు భూకబ్జాల నిరో ధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ (Prevention of Land Grabbing) యాక్ట్ ను తీసుకువచ్చే అంశంపై కూడా కేబినెట్లోచర్చించారని తెలి సింది. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల22 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం విడు దల చేసిన శ్వేత పత్రాల పైనా చ ర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.