*మే డేస్ఫూర్తితోఉద్యమించాలి: హనుమంతరావు
Workers Rights Violation : ప్రజా దీవెన, కోదాడ: కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తమ హక్కులను కాలరాస్తుందని కార్మికులు మే డే స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఐ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు ఎఐటియుసి ప్రాంతీయ నాయకులు పోతురాజు సత్యనారాయణ అన్నారు.
గురువారం మే డే సందర్భంగా మండల పరిధిలోని అల్వాల్ పురం గ్రామంలో ఉత్తమ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పక్కనే ఉన్న కమ్యూనిస్టు పార్టీ జెండాను వారు ఆవిష్కరించి మాట్లాడారు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్ లు గా కేంద్ర ప్రభుత్వం మార్చిందని విమర్శించారు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి రైల్వే బ్యాంకింగ్ రంగాలకు స్వదేశీ విదేశీ ప్రైవేట్ పెట్టబడును ఆహ్వానిస్తుందని వారు విమర్శించారు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం పై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసారు దేశంలో మతతత్వ రాజకీయాలు రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వం కాలం గడుపుతుందని రానున్న కాలంలో మేడే పోరాట స్ఫూర్తితో హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కంబాల స్వామి, పసుపులేటి గోవిందరావు,, గోసు దిబ్బయ్య ,గడ్డం బిక్షం ,వెంకటేశ్వర్లు, కంబాల నరసింహారావు ,గోసు గోపి, శ్రీను, బిక్షం, గోసు నాగేశ్వరరావు, రామయ్య ,సాయి ,తదితరులు పాల్గొన్నారు