Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chairman Gutta Sukhender Reddy : ఏడుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

— మండలిలో ప్రమాణం చేయిం చిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Chairman Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్ : తెలం గాణలో నూతనంగా ఎన్నికైన ఏడు గురు ఎమ్మెల్సీలతో శాసనమండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సో మవారం ప్రమాణస్వీకారం చేయిం చారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రo లో జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీ జేపీ నుంచి మల్కా కొమురయ్య, అంజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశా రు. అదేవిధంగా నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌ రెడ్డి ఎ మ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశా రు.

ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంల తో మండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయిం చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీ ధర్ బాబు , కేంద్రమంత్రి కిషన్ రె డ్డి , మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూ టీ చైర్మన్ బండ ప్రకాష్ , ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి , తెలం గాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా’ నరసిం హాచార్యులు,ఎమ్మెల్సీ మహేష్ కు మార్ గౌడ్, మాజీమంత్రి జానా రెడ్డి , ఎమ్మెల్యేలు బి లక్ష్మా రెడ్డి , బాలు నాయక్ , మందుల శా మ్యూల్ , పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎం పీలు చామల కిరణ్ రెడ్డి, రఘు వీర్ రెడ్డి , రఘునందన్ రావు, తది తరులు పాల్గొన్నారు.