Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chairman Kodanda Reddy : విత్తనం అన్నదాత ప్రాథమిక హ క్కు

— రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

Chairman Kodanda Reddy : ప్రజా దీవెన రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అల్మాస్ పల్లి గ్రామంలో విత్తనాల పండుగ మూడు రోజుల పాటు ఘనంగా సాగింది. చివరి రోజు విత్తనాల పండుగ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ స భ్యులు కెవిన్ రెడ్డి హాజరయ్యారు.
గ్రీన్ రెవల్యూషన్ మరియు భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో విత్తనాల పండుగ కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ మూడు రోజు లపాటు జరిగిన విత్తనాల పండుగ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు సంబం ధించిన రైతులు హాజరై వారు త యారు చేసిన విత్తనాలను స్టాల్స్ లో ప్రదర్శించారు. దాదాపు 30 కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేసి రైతు లు స్వతహాగా తయారు చేసు కు న్న మూల విత్తనాలను వాటి ప్రా ముఖ్యతను వివరించారు.

దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా లోని రాజస్థాన్, మ హారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రా ష్ట్రాలకు చెందిన రైతులు కూడా ఈ విత్తనాల పండుగలో పాల్గొన్నా రు. విత్తనాల పండుగ వేడుకలో పాల్గొన్న రైతు కమిషన్ కోదండరెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

విత్తనం రైతు ప్రాథమిక హక్కుని, కానీ గత మూడు దశాబ్దాలుగా అది మల్టీ నేషనల్ కంపెనీల చేతు ల్లోకి వెళ్లిందన్నారు. ఫలితంగానే రైతు ఆత్మహత్యలు మొదలయ్యా ని గుర్తుచేశారు. విత్తనం రైతు హ క్కు అనేది నినాదం కాదని, అది రైతు జీవన విధానానికి మార్గదర్శ కమన్నారు.

ఒకప్పుడు రైతు తాను పండించిన పంటలో నుంచే విత్తనం పెంచుకొని భద్రపరిచి మళ్లీ వచ్చే పంటకు వా డుకునే వాడని, అంతటి ప్రాధాన్య త ఉన్న విత్తనం నేడు క్రమంగా రై తు చేతిలో నుంచి బయటకు పో యిందన్నారు. విత్తనం రైతు చేతు ల్లో లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేకుండా పోవచ్చన్నారు. మళ్లీ రై తులు చేతులకి విత్తనం రావాలని, రైతులు ప్రకృతి సాగు వైపు దృష్టి పెట్టాలని కోరారు.

విత్తనాల పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన దొంతి నరసిం హా రెడ్డి అభినందించారు రైతు కమి షన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇక భూసా రం తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు పై ఉందన్నారు కమిషన్ సభ్యులు కేబీఎన్ రెడ్డి.
పెస్టిసైడ్ చల్లడం తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్లా లన్నారు. భూసారం తగ్గడం వల్ల పంట దిగుబడి పడిపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడు తుం దని గుర్తు చేశారు.

మన పూర్వికులు చేసిన పద్ధతు ల్లో మళ్లీ పంటల సాగు చేయాలనీ సూచించారు. పురుగుమందులు ఎరువుల వాడకం తగ్గిస్తే మంచి దన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన రైతులు వారు తయారుచే సుకున్న విత్తన స్టాల్స్ ను పరిశీ లించారు.