— కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్య
English Language Challenges : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఇంగ్లీషులో మాట్లాడే వారు సిగ్గు పడే రోజులు రానున్నాయని, ఆ సమయం ఎం తో దూరంలో లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యా ఖ్యలు చేశారు. జాతి ఐక్యతకు భారతీయ భాషలే ఆత్మ వంటి వన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఐఏఎస్ మాజీ అధికారి అష్తోష్ అగ్నిహోత్రి రచించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మన దేశంలోని భాష లే మన సంస్కృతికి రత్నాలు అని అభివర్ణించారు.భాషలు లేకుంటే మనం భారతీయులమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మన చరిత్ర, మన సంస్కృతి, మన ప్రాంతీ యతను అర్థం చేసుకునేం దుకు ఏ విదేశీ భాషకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. విదేశీ భాషలతో భారతీయ భావనను సంపూర్ణంగా అర్థం చేసుకోలేర న్నారు. మన భాషలతో కూడిన ఆత్మ గౌరవంతో మన దేశం ప్రపం చాన్ని ముందుకు నడిపిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో మార్పు అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయ న సాహిత్యాన్ని ప్రశంసించారు. ఇది సమాజానికి ఆత్మ వంటిదన్నారు. మన దేశం కటిక చీకటి యుగంలో మునిగిపోయినప్పుడు సైతం సాహి త్యం మన మతం, స్వేచ్ఛ, సంస్కృ తి.. దీపాలను వెలిగించిందని అమి త్ షా గుర్తు చేశారు. ప్రభుత్వం మా రినప్పుడు.. ఎవరూ దానిని వ్యతిరే కించరన్నారు. కానీ ఎవరైనా మన మతం, సంస్కృతి, సాహిత్యాన్ని తాకడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం మన సమాజం వారిని ఎదుర్కొని, ఓడించిందని గుర్తు చేశారు. అందుకే సాహిత్యం.. మన సమాజానికి ఆత్మ వంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా విశ్లేషించారు.