Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chamala Kiran Kumar Reddy:గుజరాత్ తరహాలో తెలంగాణ

–తెలంగాణనూ గుజరాత్ అభివృద్ధి చేయాలి
— కేంద్రాన్ని కోరిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్

Chamala Kiran Kumar Reddy:ప్రజా దీవెన న్యూఢిల్లీ: ప్రధాని మోదీ (pm)తెలంగాణపై వివక్ష చూప కుండా గుజరాత్ మాదిరిగా అభి వృద్ధి చేయాలని భువనగిరి కాంగ్రెస్ (Congress ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) డిమాండ్ చేశారు. ఆయన మంగ ళవారం దిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లా డారు. వచ్చే బడ్జె ట్ లో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, నేషనల్ డిజైన్ సెంటర్లతో పాటు స్మార్ట్సిటీ లుగా ప్రకటించిన వరంగల్, కరీంన గర్లకు నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్లో ఐటీఐఆర్, పోచంపల్లిలో ఐఐహెచ్ లో ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఐఐఎం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.1,200 కోట్ల బకాయిలు, ఆర్ఆర్ఆర్ను త్వరగా పూర్తి చేయడం, భువన గిరి, చిట్యాల, చౌటుప్పల్-సంగారెడ్డి వయా షాద్నగర్ రహదారులను జాతీయ రహదారులుగా (National Highways) ప్రకటించ డం తదితర అంశాలను పరిష్కరిం చాలని కోరారు. ఈ నెల 22 నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశా ల్లో 17 మంది ఎంపీలు(mps) తెలంగాణ అభివృద్ధి కోసం గళమెత్తాలని పిలు పునిచ్చారు.