Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MEOSuspension : చందంపేట ఎంఈఓ చందర్ సస్పెన్షన్

— విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయురాలికి వేతనం చెల్లించడం పై చర్యలు

— ఎంఈఓ ను సస్పెండ్ చేసిన ఆర్జెడి విజయలక్ష్మి

— గతంలోనే సస్పెన్షన్ కు గురైన ఉపాధ్యాయురాలు, హెడ్ మాస్టర్లు

MEOSuspension : ప్రజాదీవెన నల్గొండ: ప్రభుత్వ ఉపాధ్యా యురాలు ఏడాదిగా పాఠశాల కు వెళ్లకుండానే జీతం తీసుకుంటూ దొరికిపోయింది. ఆమెకు హెడ్ మాస్టర్, ఓ అధికారి కూడా సహక రించారు. జీతంలో కొంత వాట తీసుకుని వారు కూడా ఆమెకు వత్తాసు పలికారు. విషయం బయటకు పొక్కడంతో విద్యాశాఖ అధికారులు గతం లోనే ముగ్గురినీ సస్పెండ్ చేశారు. కాగా తాజాగా విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయురాలికి వేతనం చెల్లించిన కారణంగా చందంపేట ఎంఈఓ చందర్ ను సస్పెండ్ చేస్తూ సో మవారం ఆర్జెడి విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ వార్త జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఈ తతం గం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

పిల్లలందరికీ చదువుకునే హక్కుంది, వారికి నాణ్యమైన విద్య నందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పా ఠశాలలను ఏర్పాటు చేశాయి. పిల్లలకు మంచి విద్యను అందిం చడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉపాధ్యాయులను నియమిస్తుంటాయి. మరి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పిల్లల మెరుగైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు కాస్త.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ..  విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటు న్నారు.

కాగా గత ఏప్రిల్ నెలలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చిం ది. ఏడాదిగా పాఠశాలకు రాకుండా.. పూర్తి జీతం తీసుకుంటున్న వ్యవహారం బహిర్గతమైనది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చందం పేట మండలం, గాగిళ్లాపురంలో వెలుగు చూసింది. ఇక్కడ ఉన్న మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న పర్వీన్ సుల్తానా ఏడాద నుంచి విధులకు హాజరు కాకుం డానే పూర్తి జీతం తీసుకుంటుంది.

ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన పర్వీనా సుల్తానా ప్రారంభంలో కొ ర్రతండా ప్రాథమిక పాఠశాలలో పని చేసేది. అయితే అక్కడ విద్యా ర్థులు లేక పోవడంతో.. ప్రభుత్వం గతేడాది జులైలో.. పర్వీన్ సుల్తా నాని డిప్యూటేషన్ మీద గాగిళ్లాపురం పాఠశాలకు మార్చింది. అక్క డకు వెళ్లిన దగ్గర నుంచి ఆమె విధులకు సరిగా హాజరు కావడం లేదు. అంతేకాక అప్పడప్పుడూ పాఠశాలకు వచ్చి.. హాజరుప ట్టిక లో సంతకాలు పెట్టి వెళ్తుండేది. ఇందుకు స్కూల్ ప్రధానో పాధ్యా యుడు కూడా అభ్యంతరం వ్యకం చేయలేదు.

ఇలా ఏడాది పా టుగా సుల్తానా పాఠశాలకు వెళ్లకుండా పూర్తి జీతం తీసుకుం టుంది. ఈ వ్యవహారంలో స్కూల్ హెడ్ మాస్టర్ వేణు మా ధవ్, ఇన్ఛార్జ్ మాజీ ఎంఈవో సామ్యా నాయక్ కూడా పాలు పంచు కున్నారు. సుల్తానా తనకు వచ్చిన జీతంలో సగ భాగాన్ని హెచ్ఎం వేణు మాధవ్, సామ్యా నాయక్ కి ఇచ్చేది. దాంతో వారు ఆమెకు మద్దతుగా ఉన్నారు. ఏడాది పాటు వీరు ఇలా దర్జాగా ఎంజాయ్ చేశారు.

అయితే ఉపాధ్యాయ సంఘాలు వీరి వ్యవహారం గురించి డీఈవో భిక్షపతికి ఫిర్యాదు చేశాయి. డిఇఓ స్పందించకపోవడంతో ఉపా ధ్యాయ సంఘాల నేతలు డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేం దుకు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న డీఈఓ దిగి వచ్చి.. మునుగోడు ఎంఈఓ కత్తుల రవీందర్ ను విచారణ అధికారిగా నియమించి ఏప్రిల్ 22వ తేదీన విచారణ చేయించారు. విషయం వాస్తవమని తెలియడంతో అదే నివేదికను డిఇఓ కు అందజేశారు.

దీంతో ఉపాధ్యాయురాలు పర్వీనా సుల్తానాతో పాటుగా ఆమెకు సహకరించిన హెడ్ మాస్ట వేణు మాధవ్, ఇన్ఛార్జ్ మాజీ ఎంఈవోగా ఉన్న సామ్యా నాయక్ ను కూడా విద్యా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా తాజాగా అందుకు కారకులైన చందంపేట మండల విద్యాధికారి చందర్ ని కూడా ఆర్ జెడి విజయలక్ష్మి స స్పెండ్ చేశారు. కాగా ఎంఈఓ చందర్ ఇదే నెల లో పదవి విరమణ పొందనున్నట్లు తెలిసింది.